సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో జనం ఇబ్బందిపడ్డారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డి, లింగంపేట, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్నగర్, రామారెడ్డి తదితర మండలాల్లో వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. కళ్లాలు, కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయి మరింత నష్టం వాటిల్లింది. బలమైన గాలులకు పలుచోట్ల చెట్టు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోమకొండలో పిడుగుపడడంతో కొబ్బరిచెట్టు కాలిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో
తడిసిన ధాన్యం
ఈదురు గాలులతో కూలిన చెట్లు