కరప: వాకాడలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూలులో ఆదివారం జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఐదు విభాగాల్లో 78 ఈవెంట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో 100 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ఇందులో విజేతలు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే తొమ్మిదో రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్ వింటర్ ఆక్వాటిక్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా స్విమ్మింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెదిరెడ్డి సతీష్, ఇరుసుమల్ల రాజు, మంగా వెంకట శివరామకృష్ణ తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ స్కూలు చైర్మన్ గ్రంధి నారాయణరావు (బాబ్జీ), కోచ్ పాల్గొన్నారు.
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు
3,947 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను జిల్లా వ్యాప్తంగా ఆదివారం 15 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 4,170 మంది దరఖాస్తు చేసుకోగా 3,947 మంది హాజరయ్యారు. 196 మంది పరీక్ష రాయలేదు. పరీక్ష కేంద్రాలను డీఈఓ నాగమణి సందర్శించారు.