జమ్మిచేడులో వాస్తవ పరిస్థితి ఇదీ.. | Sakshi
Sakshi News home page

జమ్మిచేడులో వాస్తవ పరిస్థితి ఇదీ..

Published Tue, Apr 23 2024 8:20 AM

జమ్మిచేడు ప్రాంతంలో వెలసిన కల్లుడిపో  - Sakshi

జిల్లా కేంద్రానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మిచేడులో ఓ కల్లు దుకాణానికి ఆబ్కారీ శాఖ నుంచి లైసెన్స్‌ ఉంది. ఈసొసైటీలో సుమారు 180 నుంచి 200 మంది వరకు సభ్యులుగా ఉండగా.. కల్లు దుకాణాన్ని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నిర్వహించేవారు. ఈదుకాణం ద్వారా జమ్మిచేడుతో పాటు, జమ్ములమ్మ జాతరలో కూడా కల్లు విక్రయాలు కొనసాగుతుండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక, అధికార పార్టీకి చెందిన కొందరి చూపు కల్లు దుకాణంపై పడింది. కల్లు దుకాణం ఏర్పాటు కోసం పోటీకి దిగారు. జమ్మిచేడులో అప్పటికే లైసెన్స్‌ ద్వారా కొనసాగుతున్న కల్లు దుకాణానికి పోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా మరో కల్లుదుకాణం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా పాతపాలెం, గోన్‌పాడ్‌ గ్రామాలకు చెందిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కీలకపాత్ర పోషించారనే ప్రచారం జోరుగా ఉంది.

Advertisement
Advertisement