‘సౌత్‌జోన్‌’ పోటీలకు కేయూ జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

‘సౌత్‌జోన్‌’ పోటీలకు కేయూ జట్టు ఎంపిక

Published Thu, Nov 9 2023 1:56 AM

-

కేయూ క్యాంపస్‌ : కాకినాడలోని జేఎన్‌టీయూలో ఈనెల 9 నుంచి 12 వరకు జరుగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య పి.శ్రీని వాస్‌రావు బుధవారం తెలిపారు. నానుగొప్పుల అజయ్‌కుమార్‌ (వాగ్దేవి కళాశాల, హనుమకొండ), చింతు శివాజీ, కె.యువరాజు, మధుపవన్‌ (కేడీసీ, హనుమకొండ), కె.గాంధీ, భూక్యా ఆజాద్‌, రమావత్‌ అనిల్‌కుమార్‌, అజ్మీరా అఖిల్‌ (ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ఖమ్మం), అంబాల రంజిత్‌కుమార్‌ (వీసీపీఈ బొల్లికుంట), గుగులోత్‌ లక్‌పతి టి.ఆకాష్‌ (యూసీపీఈ కేయూ, వరంగల్‌), ఎం.పవన్‌కల్యాణ్‌ ఎల్‌బీ కళాశాల, వరంగల్‌) జట్టులో ఉన్నారు. ఈ జట్టు ఈనెల 7న రాత్రి బయలుదేరి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. జట్టుకు వాగ్దేవి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ పి.కిషన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement