జగన్‌ పాలనలో జీవితాల్లో వెలుగులు | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనలో జీవితాల్లో వెలుగులు

Published Wed, Mar 27 2024 2:10 AM

ఈదర, శోభనపురం ప్రచారంలో మేకా ప్రతాప్‌ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య - Sakshi

ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

ఆగిరిపల్లి: రాష్ట్రంలో ప్రజల సంక్షేమ కోరుకునే ఏకై క నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని ఆయనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మంగళవారం రాత్రి ఈదర, శోభనాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతాప్‌ అప్పారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామ కోటయ్య ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నవరత్నాల పథకాలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏనాడు ఒక మంచి చేయలేదన్నారు. ఈదర గ్రామంలోనే రూ.55 కోట్లతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. పెనమలూరులో టికెట్‌ ఇచ్చేందుకు పనికిరాని వ్యక్తి నూజివీడు నియోజవర్గ ప్రజలకు ఎలా పనికి వస్తాడో ప్రజలు ఆలోచించాలన్నారు. చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ నూజివీడులో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించానని, పేద ప్రజలలో జగన్‌మోహన్‌ రెడ్డికి ఆదరణ చూసి వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికామన్నారు. ఎంపీపీ గోళ్ళ అనూష, పీఎసీఎస్‌ అధ్యక్షుడు దన్నపనేని వేణు, వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు, సత్యంబాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజనా కుమారి, పెరికి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అత్తి పార్వతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement