
నేటి నుంచి జిల్లాలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని అన్ని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయా ల్లో బుధవారం నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జి ల్లా రిజిస్ట్రార్ రమణ మూర్తి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 4న తొలుత జిల్లా కేంద్రంలోని ఆ ర్వో (అర్బన్)కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈవిధానాన్ని అమలు చేశామన్నారు. ప్రక్రియ సజావుగా జరుగుతుండడంతో ఈనెల 30 నుంచి మిగిలిన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నమన్నారు. క్రయ, విక్రయదారులు ముందుగా వారు కోరుకున్న తేదీ, సమయంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. వారికి నిర్దేశించిన సమయంలో నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్లవచ్చని చెప్పారు. దీంతో సమయం ఆదా అవుతుందన్నారు. చిత్తూరు రూరల్, బంగారుపాళెం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, కార్వేటినగరం, నగరి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక స్లాట్ బుకింగ్ ద్వారా పనులు చేసుకోవచ్చన్నారు. చిత్తూరు ఆర్వో కార్యాలయం మినహా అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజు 39 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. చిత్తూ రు ఆర్వోలో 78 స్లాట్స్ వెసులుబాటు ఇచ్చారన్నా రు. నిర్దేశించిన సమయంలో బుక్ చేసుకున్నవారు వచ్చినా, రాకున్నా మరొకరికి అవకాశం ఇవ్వరన్నారు. స్లాట్ను రీ షెడ్యూల్ చేసుకోవాలంటే రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇన్చార్జ్ డీఎల్పీఓగా శ్రీనివాసులు
చిత్తూరు కార్పొరేషన్: డీఎల్పీఓ పార్వతి బుధవారం ఉద్యోగవిరమణ చేయనున్నారు. దీంతో ఆమె స్థానంలో ఇన్చార్జ్గా పూతలపట్టు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులును నియమించారు. మే 1 నుంచి ఈయన ఇన్చార్జ్గా కొనసాగనున్నారు.