నగదు, మద్యం సీజ్‌ | Sakshi
Sakshi News home page

నగదు, మద్యం సీజ్‌

Published Wed, Nov 22 2023 12:26 AM

దమ్మపేట: కారులో తనిఖీ చేస్తున్న అధికారులు   - Sakshi

రూ.2.8లక్షల నగదు

ఖమ్మంక్రైం: సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2.80 లక్షల నగదును ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో ఈఓ వ్యక్తి వద్ద ఈ నగదు లభ్యమైందని, సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు.

భద్రాచలంలో..

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని కూనవరం రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఒక వ్యక్తి నుంచి రూ.96 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.54 వేలను గుర్తించి స్వాధీనం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్‌ చేశామని సీఐ నాగరాజురెడ్డి మంగళవారం తెలిపారు.

మోరంపల్లిబంజరలో...

బూర్గంపాడు: మోరంపల్లిబంజరలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద మంగళవారం పోలీసుల తనిఖీల్లో ఆరు మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఓ కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న మద్యం బాటిళ్లను సీజ్‌చేసి, కేసు నమోదు చేశారు.

మందలపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద...

దమ్మపేట: ఎన్నికల నిబంధనల మేరకు చేస్తున్న తనిఖీల్లో, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, మద్యం సీసాలను ఎఫ్‌ఎ్‌స్‌ టీం ఆధ్వర్యంలో పోలీసులు సీజ్‌ చేశారు. మంగళవారం మండలంలోని మందలపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద చేస్తున్న తనిఖీల్లో రెండు వేర్వేరు కార్లలో కలిపి మొత్తంగా రూ.1,69,500 నగదును గుర్తించారు. ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌ చేశారు. దమ్మపేట గ్రామంలోని అర్బన్‌ కాలనీ, లచ్చాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 132 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని ఎఫ్‌ఎస్‌ టీం అధికారి కృష్ణ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement