నాడు–నేడు పనులు వేగవంతం | Sakshi
Sakshi News home page

నాడు–నేడు పనులు వేగవంతం

Published Sat, May 25 2024 4:45 PM

నాడు–నేడు పనులు వేగవంతం

లక్కిరెడ్డిపల్లి : మండలంలో నాడు–నేడు పనులు వేగవంతం చేసి వెంటనే పూర్తిచేయాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ మోడల్‌ స్కూల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు చోటు ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని సూపరిటెండెంట్‌, డీఈఓలకు సూచించారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందేట్లు చూడాలని ఎంఈఓలకు సూచించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓలు చక్రే నాయక్‌, వెంకట సుబ్బయ్యలతో ఆయన మాట్లాడుతూ ఈ జూన్‌ 12వ తేదీలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, మల్లికార్జున, సీఆర్‌పీలు మోహన్‌ రావు, శశికళ, చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి

శివప్రకాష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement