రాజంపేటలో రంగమ్మత్త సందడి | Sakshi
Sakshi News home page

రాజంపేటలో రంగమ్మత్త సందడి

Published Fri, Dec 8 2023 1:18 AM

ఎంజీఆర్‌ మాల్‌ ప్రారంభానికి వచ్చిన అనసూయ - Sakshi

రాజంపేట: రాజంపేట పట్టణంలో సినీనటి అనసూయ భరద్వాజ సందడి చేశారు. తిరుపతి రహదారిలోని చైన్నె ఎంజీఆర్‌మాల్‌ను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్‌ ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, కమిషనరు జనార్ధన్‌రెడ్డి, ఏఐటీఎస్‌ వైస్‌చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని చూసేందుకు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి యువత పెద్దఎత్తున వచ్చారు. అనంతరం మీడియాతో అనసూయ మాట్లాడుతూ రాజంపేటలో ఎంజీఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఎంజీఆర్‌మాల్‌ అధినేత గిరిధర్‌ మాట్లాడుతూ మధ్యతరగతికి కుటుంబానికి సరసమైన ధరల్లో నాణ్యమైన దస్తులను అందచేయడమే తమ లక్ష్యమన్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement