ద్విచక్ర వాహనదారు సజీవ దహనం | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనదారు సజీవ దహనం

Published Mon, Apr 8 2024 1:25 AM

నరేష్‌ (ఫైల్‌) - Sakshi

పెద్దవడుగూరు : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే సజీవ దహనయ్యాడు. పెద్దపప్పూరు మండలం తురకపల్లికి చెందిన ముచ్చుకోట నరేష్‌ (35) ఆదివారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో గుత్తికి చేరుకున్నాడు. పని ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమైన ఆయన పెద్దవడుగూరు మండలం వీరేపల్లి సమీపంలో డీజిల్‌ అయిపోయి రోడ్డు పక్కనే ఆపి ఉన్న లారీని ఢీకొన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ద్విచక్ర వాహనం నుంచి మంటలు ఎగిసిపడి నరేష్‌ను చుట్టుముట్టాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందరూ చూస్తుండగానే సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నరేష్‌కు భార్య లలిత, ఇద్దరు సంతానమున్నారు.

Advertisement
Advertisement