విద్యుత్‌షాక్‌తో ఆర్టీసీ కండక్టర్‌ మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో ఆర్టీసీ కండక్టర్‌ మృతి

Published Thu, Dec 7 2023 1:10 AM

మృతుడు కె.ఎస్‌.రావు - Sakshi

అనకాపల్లిటౌన్‌: విద్యుత్‌ షాక్‌తో మండలంలో సిరసపల్లి గ్రామం పోర్టు కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ కె.ఎస్‌.రావు మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ నర్సింగరావు బుధవారం చెప్పారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు... కె.ఎస్‌.రావు తమ ఇంటిలో వాటర్‌ మోటర్‌ స్వీచ్‌వేసినప్పుడు విద్యుత్‌షాక్‌ గురై పడిపోయాడు. హుటాహుటిన స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయానికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు భార్య ఉమా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతినికి భార్య, కుమార్తె ఉన్నారు.

Advertisement
Advertisement