62 కిలోల గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

62 కిలోల గంజాయి స్వాధీనం

Published Fri, Apr 19 2024 2:05 AM

పోలీసుల అదుపులో గంజాయి నిందితులు   - Sakshi

మోతుగూడెం: వై.రామవరం మండలం డొంకరాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ శివకుమార్‌ చెప్పారు. ఈ కేసులో నలుగురు నిందితులను, ఒక బైక్‌, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డొంకరాయిలో చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా బైక్‌ డిక్కీలో రెండు కిలోల గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నట్టు చెప్పారు. మంగంపాడు గ్రామం నుంచి వస్తున్న ఆటోని తనిఖీ చేయగా 60 కిలోల గంజాయి దొరికిందని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండు కేసుల్లో దొరికిన గంజాయి విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందని తెలిపారు. ఆయా కేసుల్లో నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్టు చెప్పారు.

Advertisement
Advertisement