రాజవొమ్మంగి: స్థానిక గ్రామదేవత శ్రీనూకాలమ్మ అమ్మవారి గుడి తలుపులు తెరచుకొన్నాయి. కొత్త అమావాస్యకు జరిగే తిరునాళ్లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వంశపారంపర్యంగా వస్తున్న గుడి ఆసాదులు అమ్మవారి తలుపులు తీసి గరగలను బయటకు తీయడంతో ఉత్సవాలు మొదలైనట్టు స్థానికులు భావిస్తారు. ప్రతి రోజు రాత్రిళ్లు జరిగే గరగ నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా వెలుగుల్లో తమ ఇళ్లకు వచ్చే గరగలను సాక్షాత్తు అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, రకరకాల పిండివంటలు, పండ్లు పూలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం గ్రామస్తుల ఆచారం. ఏప్రిల్ 6. 7. 8 తేదీల్లో అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. వేలాదిగా భక్తులు హాజరవుతారు. 9వ తేదీ తెల్లవారుజాముతో ఉత్సవాలు ముగించడంతో తిరిగి గుడి తలుపులు మూసి వేస్తారు. కొత్త అమావాస్య పండుగ ముగియగానే వచ్చే నూతన సంవత్సరం రోజున రైతులు ఏరువాక సాగి పొలం పనులకు శ్రీకారం ఆనవాయితీ. నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిపేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
నూకాలమ్మ ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
Published Thu, Mar 28 2024 12:55 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement