నేడు ‘వికసిత్‌’ సంకల్పయాత్ర సభ | Sakshi
Sakshi News home page

నేడు ‘వికసిత్‌’ సంకల్పయాత్ర సభ

Published Tue, Nov 21 2023 1:18 AM

వంట్లమామిడిలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌ - Sakshi

సాక్షి,పాడేరు: జిల్లాలోని వంట్లమామిడిలో ఈనెల 21 మంగళవారం వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిలో భాగంగా పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ సోమవారం వంట్లమామిడి గ్రామాన్ని సందర్శించి సభా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న సంక్షేమ,అభివృద్థి పథకాలపై ఛాయాచిత్ర ప్రదర్శనతో పాటు, జీసీసీ, డీఆర్‌డీఏ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఎం నరేంద్రమోది అదనపు కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అతీష్‌చంద్ర మంగళవారం పాడేరు విచ్చేస్తున్నారు. వంట్లమామిడిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలను గిరిజనులకు వివరిస్తారని ఐటీడీఏ పీవో అభిషేక్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవోలు వి.ఎస్‌.ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు,డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా, ఎంపీడీవో సాయినవీన్‌, ఐటీడీఏ ఏఏవో శ్రీనివాసకుమార్‌, ఏఈ దేముళ్లు, ట్రైకార్‌ సంస్థ అధికారి సీతారామయ్య పాల్గొన్నారు.

వంట్లమామిడిలో ఏర్పాట్లు పూర్తి

పరిశీలించిన పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌

పాల్గొంటున్న పీఎం అదనపు కార్యదర్శి అతీష్‌చంద్ర

Advertisement
Advertisement