ad after 5 item on listing page
-
బీజేపీ నుంచి ‘జిట్టా’ సస్పెన్షన్
సాక్షి, యాదాద్రి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, వారం రోజుల్లోగా పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇవ్వాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీలో చేరిన ఒకటిన్నర సంవత్సరంలోనే బాలకృష్ణారెడ్డి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుని హోదాలో జిట్టా బాలకృష్ణారెడ్డి తన పార్టీని 2022 ఫిబ్రవరి 16న బీజేపీలో విలీనం చేశారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఢిల్లీలో ఆయన బీజేపీ గూటికి చేరారు. అయితే కొంత కాలంగా బీజేపీకి జిట్టా దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా.. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జిట్టా బాలకష్ణారెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. భువనగిరి కోటను విద్యుత్ దీపాలతో అలంకరించి, తెలంగాణ సంప్రదాయంలో వంటకాలు చేయించి పెద్ద ఎత్తున హోలీ పండుగ నిర్వహించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే, 2009లో టీఆర్ఎస్ పార్టీ మహా కూటమిలో చేరింది. ఆ ఎన్నికల్లో భువనగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి టీడీపీ నుంచి మహా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆయన మరోసారి 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018లో బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో బీజేపీలో తన యువ తెలంగాణ పార్టీని విలీనం చేయడం ద్వారా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలోనే తన రాజకీయ గురువు బండారు దత్తాత్రేయతో, బండి సంజయ్తో ఉన్న సత్సంబంధాలతో జిట్టా బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. -
అనిల్కుమార్రెడ్డికి ఎంపీ టికెట్?
సాక్షి, యాదాద్రి: మూడు రోజుల క్రితం బీఆర్ఎస్లో చేరిన మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డికి రానున్న లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. పార్టీలో చేరిక సందర్భంగా కేసీఆర్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పరాజయం పొందారు. అనంతరం బూర నర్సయ్య బీజేపీలో చేరారు. ఆయన రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధినేత అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరిన అనిల్కుమార్రెడ్డికి ఎంపీ టికెట్ హామీ లభించినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అనిల్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడానికి ముందు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తానని సీఎం హామీ ఇవ్వగా అనిల్కుమార్రెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అనిల్కుమార్రెడ్దిలు ఇద్దరూ భువనగిరిలో కలిసి పనిచేయాలని చెప్పిన విషయం వెనక అంతరార్థం ఇదేనని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అనిల్కుమార్రెడ్డి చేరికతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డికి అసెంబ్లీ టికెట్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. -
గడ్కరీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్హెచ్– 365పై నకిరేకల్ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయినందు న, అందులోనే అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణం విస్తరిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో జాతీ య రహదారి 167పై అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్రోడ్డు నుంచి వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు మీదుగా కొత్తగూడెం జాతీయ రహదారి–30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తారు సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీ వేస్తారని సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతనాలు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గడ్కరీకి వినతిపత్రం అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
భువనగిరిలో పోటాపోటీ
భువనగిరి లోక్సభ నియోజకవర్గం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగుతుర్తి, ఆలేరు, జనగామ (వరంగల్) ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) నియోజకవర్గం ప్రత్యేకతలు: చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఓట్లు కీలకం. ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య ఎక్కువ . పట్టణీకరణ వల్ల పెరిగి పోయిన సమస్యలు ప్రధాన అభ్యర్థుల వీరే - కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (కాంగ్రెస్) - బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) - చెరుపల్లి సీతారాములు (సీపీఎం) - నల్లు ఇంద్రాసేనారెడ్డి (బీజేపీ) - కపిలవాయి దిలీప్కుమార్ (రాష్ట్రీయ లోక్దళ్) మొత్తం ఓటర్లు: 14,85,021 ఎన్.క్రాంతి, నల్లగొండ: భువనగిరి లోక్సభ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. వరంగల్ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. స్థానిక కేడర్ను తయారుచేసుకోలేక పోయినవారు ఆ జిల్లా కేడర్, అసెంబ్లీ అభ్యర్థులపై పూర్తిస్థాయిలో ఆధారపడాల్సి వస్తోంది. కాకపోతే ఏడు సెగ్మెంట్లూ తెలంగాణవాదం బలంగా ఉన్నవి కావడంతో కొంత ఆశతో ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసేవి ఇవే.. భువనగిరి ఎంపీ అభ్యర్థుల గెలుపోటములను ఈ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. సాగు, తాగునీరు ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ రైతులు గోదావరి, మూసీ నదీ జలాలు అందించాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని మునుగోడు సెగ్మెంటులో ఫ్లోరైడ్ సమస్య ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఈ నియోజకవర్గంలో చేనేత రంగంపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. వీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే రైల్వే ఆధునికీకరణ, భువనగిరి వరకు మూడో రైల్వే లైను నిర్మాణం, బీబీనగర్- నడికుడి మార్గంలో డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ వంటి సమస్యలు ఉన్నాయి. భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రధానంగా ఆధారపడుతోంది తెలంగాణ సెంటిమెంటు ఓటుపైనే. తెలంగాణ ఇచ్చిన తమకే ప్రజలు పట్టం కడతారనే ధీమాతో కాంగ్రెస్, తెలంగాణ వచ్చిందే తమ పార్టీ వల్ల కాబట్టి ఓట్లన్నీ తమకేనని టీఆర్ఎస్, తెలంగాణ ఏర్పాటులో తమదే కీలకపాత్ర కాబట్టి ఓటర్ల మొగ్గు తమవైపేనని బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. ఇక రాష్ట్రీయ లోక్దళ్, సీపీఎంలు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. నే.. గెలిస్తే.. - సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తా - బీబీనగర్ నిమ్స్ను అభివృద్ధి చేస్తా - చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తా - భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా ఏర్పాటు చేయిస్తా - కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (కాంగ్రెస్) అనుకూలం - అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన సిట్టింగ్ అభ్యర్థులు - తెలంగాణ వాదాన్ని పార్లమెంటులో బలంగా వినిపించారన్న పేరు - తెలంగాణ ఉద్యమంలో కనిపించడం ప్రతికూలం - తెలంగాణ సెంటిమెంటు ఓటు చీలిపోయే అవకాశం - సంస్థాగతంగా ఉన్న గ్రూపులు - ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా - బీబీనగర్ నిమ్స్ను ప్రారంభించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయిస్తా - పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా - బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లాలో జ్యూస్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు చేయిస్తా. - నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ) అనుకూలం - తెలంగాణ కోసం పనిచేసిన గుర్తింపు - గతంలో ఈ నియోజకవర్గ ప్రజలతో ఉన్న పరిచయాలు ప్రతికూలం - పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం - స్థానికేతరుడు కావడం - ప్రజలకు వైద్య సేవల సమాచారంపై ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తా - సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తా - ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తా - బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) అనుకూలం - ఉద్యమ పార్టీ అభ్యర్థి కావడం - డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేయడం ప్రతికూలం - తెలంగాణ సెంటుమెంటుపైనే ఆధారపడడం - రాజకీయాలకు కొత్త కావడం - భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్షిప్గా మారుస్తా - పెద్ద చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుస్తా - నల్లగొండలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తా - భువనగిరి, కొలనుపాకను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తా - దిలీప్కుమార్ (ఆర్ఎల్డీ) అనుకూలం - టీఆర్ఎస్లో పనిచేసినప్పుడున్న పరిచయాలు - ఎమ్మెల్సీగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రతికూలం - టీఆర్ఎల్డీ బలహీనంగా ఉండడం - క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు లేకపోవడం - సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తా - పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయిస్తా - {పజలకు నిత్యం అందుబాటులో ఉంటా - భువనగిరి పట్టణాన్ని మోడల్ టౌన్గా అభివృద్ధి చేస్తా. - కులవృత్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా - చెరుపల్లి సీతారాములు (సీపీఎం) అనుకూలం - సీపీఎం సంప్రదాయ ఓటు బ్యాంకు - కార్మిక వర్గంలో పట్టుండడం - చేనేత వర్గానికి చెందిన అభ్యర్థి కావడం ప్రతికూలం - సమైక్యవాద పార్టీ అన్న ముద్ర - తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడం - సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలహీనంగా ఉండడం పోల్ పదనిసలు మూడుసార్లు... మూడు సెగ్మెంట్లు ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రతిసారీ కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్న బొజ్జపల్లి రాజయ్య ముచ్చటగా మూడోసారి కూడా కొత్త నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. 1985లో వరంగల్ జిల్లా పరకాల ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆయన 1999లో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. - న్యూస్లైన్, హన్మకొండ అలుపెరగని అజ్మీరా వరంగల్ జిల్లాకు చెందిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ తొమ్మిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎనిమిది పర్యాయాలు పోటీచేసి గెలుపోటములు చవిచూసిన ఆయన ప్రస్తుతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రులు ఎన్.యతిరాజారావు, కమాలుద్దీన్ అహ్మద్లు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కలిపి తొమ్మిది పర్యాయాలు బరిలో నిలిచినవారే. ఇదే జిల్లాకు చెందిన చందుపట్ల జంగారెడ్డి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పోటీ చేశారు. ప్రస్తుతం పోటీలో ఉన్న చందూలాల్ తొలిసారి ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా 1983లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి 1989లో ఓడిపోయారు. మళ్లీ 1994లో విజయం సాధించారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా బరిలోకి దిగి విజయ కేతనం ఎగరవేశారు. 1999లో తిరిగి ములుగు ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2009లో మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజాగా ములుగు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. - న్యూస్లైన్, వరంగల్ సిద్దిపేట.. హ్యాట్రిక్ల కోట సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పలువురు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి 1971,1977లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టగా నంది ఎల్లయ్య 1989, 1991, 1996లో విజయం సాధించారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983లో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీ ముఖ్యనేత టి.హరీష్రావు 2004, 2008, 2009, 2010 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement