-
రెండు కంపెనీలుగా టాటా మోటార్స్
టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. వాణిజ్య వాహనాలు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాలు మరో కంపెనీగా ఏర్పాటుకానుంది. తద్వారా వృద్ధి అవకాశాలను మరింత బలంగా అందిపుచ్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంటోంది. న్యూఢిల్లీ: ఆటో రంగ లిస్టెడ్ దిగ్గజం టాటా మోటార్స్ రెండు కంపెనీలుగా విడిపోయేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు టాటా మోటా ర్స్ వెల్లడించింది. వీటి ప్రకారం సంబంధిత పెట్టుబడులతో కలిపి వాణిజ్య వాహన విభాగం ఒక సంస్థగా ఏర్పాటుకానుంది. విలాసవంత కార్ల యూనిట్ జాగ్వార్ ల్యాండ్రోవర్సహా ప్యాసింజర్ వాహనాల(పీవీ) బిజినెస్ మరో కంపెనీగా ఆవిర్భవించనుంది. దీనిలో సంబంధిత పెట్టుబడులతోపాటు ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంసైతం కలసి ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు టాటా మోటార్స్ తెలియజేసింది. ఎన్సీఎల్టీ నిబంధనలకు అనుగుణంగా విడదీతను చేపట్టనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ వాటాదారులు 2 లిస్టెడ్ సంస్థలలోనూ యథాతథంగా వాటాలను పొందుతారని స్పష్టం చేసింది. టర్న్ అరౌండ్ గత కొన్నేళ్లలో కంపెనీ బలమైన టర్న్అరౌండ్ను సాధించింది. మూడు ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్లూ స్వతంత్ర నిర్వహణలో కొనసాగుతూ నిలకడైన పనితీరును చూపుతున్నాయి. తాజా విడదీతతో మార్కెట్ కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయ్. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా మోటార్స్ 12–15 నెలలు కంపెనీ విడదీతతో కస్టమర్లకు సేవలు విస్తృతమవుతాయని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని, వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. విడదీత ప్రణాళికకు రానున్న నెలల్లో బోర్డుసహా.. వాటాదారులు, రుణదాతలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందనున్నట్లు తెలియజేశారు. విడదీత పూర్తికి 12–15 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. కంపెనీ విడదీత ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపబోదని స్పష్టం చేశారు. కాగా.. వాణిజ్య, ప్రయాణికుల వాహన విభాగాల మధ్య పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు 88 అనుబంధ సంస్థలు, మూడు సంయుక్త కంపెనీలు, రెండు సంయుక్త కార్యకలాపాలు తదితరాలతో విస్తరించాయి. తాజా వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు రూ. 996 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం. చివరికి నామమాత్ర నష్టంతో రూ. 987 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ లాభాలు అదుర్స్.. ఎన్ని వేల కోట్లంటే?
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ ఆదాయం 22 శాతం జంప్చేసి 7.4 బిలియన్ పౌండ్లకు చేరింది. తగ్గిన రుణ భారం ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది. -
సనంద్ ప్లాంట్లో ఈవీల తయారీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2024 ఏప్రిల్ నుంచి గుజరాత్లోని సనంద్ ప్లాంట్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ చేపట్టనుంది. తొలుత నెక్సన్ ఈవీ మోడల్ కార్లను ఉత్పత్తి చేయనున్నామని సంస్థ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. ఫోర్డ్ ఇండియా నుంచి రూ.725 కోట్లకు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ ప్లాంటును 2023 జనవరిలో కైవసం చేసుకుంది. సనంద్ ప్లాంట్లో ఇప్పటికే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత నెక్సన్ కార్ల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం తయారీ సామర్థ్యం ఏటా 3 లక్షల యూనిట్లు. దీనిని 4.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశం ఉంది. ఇతర మోడళ్లను సైతం ఈ కేంద్రంలో రూపొందిస్తామని చంద్ర తెలిపారు. ‘ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కర్వ్ ఈవీ రానుంది. హ్యారియర్ ఈవీతోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో కర్వ్ మోడల్ను ఈ ఏడాది చవరికల్లా పరిచయం చేస్తాం. 2024–25లో ప్యాసింజర్ కార్ల పరిశ్రమ భారత్లో 5 శాతం వృద్ధి చెందనుంది. కొత్త మోడళ్ల రాకతో పరిశ్రమ కంటే మెరుగ్గా పనితీరు కనబరుస్తాం. వ్యక్తిగత ఎలక్ట్రిక్ కార్లకు ఫేమ్ ప్రయోజనాలను విస్తరించడం దేశంలో ఈవీల వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొనుగోలుదార్లకు ప్రోత్సాహకాలు అందించినప్పుడు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగాయి. ఈవీల విక్రయాలపై పన్ను రేటు కంటే వాటి తయారీకి ఉపయోగించిన ముడిసరుకుపై పన్ను రేటు ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి’ అని వివరించారు. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ భారీ షాక్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల కొనుగోలు దారులకు భారీ షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి టాటా ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని 0.7 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి వినియోగించే ముడి సరకు ధరలు పెరగడమే తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ప్రతి మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్ మోడల్పై 0.7 శాతం సగటు పెరగనుంది.ఫలితంగా, టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షలుగా ఉంది. టాటా కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దీని ధరలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్లో టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ ధరల్ని దాదాపు 0.6 శాతం పెంచింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. టాటా కంపెనీ కార్ల ధరల్ని పెంచినప్పటికీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలలో కంపెనీ 9 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2022లో 40,043 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2023 డిసెంబర్ 43,470 యూనిట్లకు చేరుకుంది. -
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్తో 25 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్ఎం టార్క్తో 120 బీహెచ్పీ, అలాగే 114 ఎన్ఎం టార్క్తో 80 బీహెచ్పీ వర్షన్స్లో తయారైంది. 6 ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్సీ, ఈఎస్పీ, క్రూజ్ కంట్రోల్, 360 లీటర్ల బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. -
నేటి నుంచి పెరిగిన కార్ల ధరలు.. ఎంతంటే..?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుందని సంస్థ పేర్కొంది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
టాటా ప్యాసింజర్ ఈవీ రైడ్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చే ఏడాదిన్నరలో అయిదుకుపైగా ఈవీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి ఆధునిక ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ అయిన యాక్టి.ఈవీ ప్లాట్ఫామ్పై విభిన్న బాడీ, సైజుల్లో ఇవి రూపుదిద్దుకుంటాయని కంపెనీ శుక్రవారం వెల్లడించింది. యాక్టి.ఈవీ ఆధారంగా తొలుత పంచ్ ఈవీ వస్తోందని ప్రకటించింది. ఈ ఈవీ మోడళ్లలో 300 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే యాక్టి.ఈవీ బ్యాటరీ ప్యాక్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ, భారత్ ఎన్సీఏపీ భద్రతా ప్రమాణాలను అనుసరించి మోడళ్ల తయారీ చేపడతామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. కాగా, పంచ్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.21,000 చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. -
కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్లో టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ల్లో ఈ వాహనాల బుకింగ్లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
వెహికల్ స్క్రాపింగ్, మరో యూనిట్ ప్రారంభించిన టాటా మోటార్స్
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ యూనిట్ను చండీగడ్లో ప్రారంభించింది. ఇప్పటికే టాటా జైపూర్, భువనేశ్వర్, సూరత్లో స్క్రాపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగాచండీగడ్లో ప్రారంభించిన ఈ స్క్రాపింగ్ యూనిట్లో ఏడాదికి 12,000 వాహనాల్ని చెత్తగా మార్చనుంది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్ఫిట్గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలను తుక్కుకు ఇస్తే.. వారికి ప్రోత్సహాకాలు ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రకటించినట్లుగా ఈ ఏడాది నుంచి కేంద్రం స్క్రాపింగ్ పాలసీ సైతం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాత వాహనాల్ని తుక్కుగా మార్చేందుకు కేంద్రం 72 కంపెనీలకు అనుమతి ఇస్తే వాటిల్లో 38 సంస్థలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల్ని తుక్కుగా మార్చి.. వాటి నుంచి వచ్చే ఇనుము, అల్యూమినియం, రబ్బర్, ప్లాస్టిక్ కేబుల్స్తో మళ్లీ వినియోగించగలిగితే .. కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు గతంలో ఒక కారును తయారు చేసేందుకు రోజులు పాటు శ్రమించేవి. టెక్నాలజీ కారణంగా ఆ సమయం కాస్త గంటలకు (35)తగ్గింది. ఇప్పుడీ ఈ స్క్రాపింగ్ పాలసీలో పాత కారుని తుక్కుగా మార్చేందుకు 3గంటల సమయం పడుతుంది. -
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
పెరగనున్న టాటా కార్ల ధరలు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ ప్యాసింజర్ వాహన ధరల్ని పెంచనుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ధరల్ని పెంచనున్నట్లు వెల్లడించింది. హ్యాచ్బ్యాక్ టియాగో ప్రారంభం వేరియంట్ ధర రూ. 5.6 లక్షల నుండి రూ. 25.94 లక్షల మధ్య విక్రయించింది. అయితే, ఎంతమేరకు ధర పెంచుతుందనే విషయాన్ని ప్రస్తావించలేదు. ‘జనవరి 2024లో మా ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ధరల్ని పెంచాలని భావిస్తున్నారు.పెంపుదల, ఖచ్చితమైన వివరాలు కొన్ని వారాల్లో ప్రకటిస్తామని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే మారుతీ సుజుకీ, ఆడీ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇప్పుడే ఆ జాబితాలో చేరింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెపె్టంబర్(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 30 శాతం జంప్ చేసి 6.9 బిలియన్ పౌండ్లకు చేరింది. హోల్సేల్ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో హోల్సేల్ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్ పౌండ్ల ఫ్రీ క్యాష్ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది. -
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ విడుదల.. కర్వ్ వచ్చే ఏడాదే..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రెండేళ్లలో మరో రెండు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) భారత్లో ప్రవేశపెడుతోంది. వీటిలో కర్వ్, సియెరా మోడళ్లు ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర వెల్లడించారు. వీటి చేరికతో కంపెనీ ఎస్యూవీ శ్రేణికి మరింత బలం చేకూరుతుందన్నారు. ఎస్యూవీలైన హారియర్, సఫారి కొత్త వర్షన్స్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హారియర్, సఫారి కొత్త వర్షన్స్ గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి అత్యుత్తమ భద్రతా రేటింగ్స్ను పొందాయి. 5–స్టార్ సేఫ్టీ రేటింగ్తో భారతీయ కంపెనీలకు చెందిన వాహనాల్లో అత్యధిక స్కోర్తో టాటా ఎస్యూవీలు ఇక్కడి రోడ్లపై అత్యంత సురక్షితమైన మోడళ్లుగా ఉన్నాయి’ అని వివరించారు. ఎక్స్షోరూంలో హారియర్ కొత్త వర్షన్ రూ.15.49 లక్షలు, సఫారి రూ.16.19 లక్షల నుంచి ప్రారంభం. ఎస్యూవీ విభాగంలో పోటీ.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ దేశీయ ప్యాసింజర్ వాహనాల (పీవీ) వృద్ధిని నడిపిస్తున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం మొత్తం పీవీల్లో ఎస్యూవీల వాటా ఏకంగా 60 శాతానికి చేరింది. చాలా కాలంగా ఎస్యూవీ విభాగంలో అగ్ర స్థానంలో ఉన్నామని శైలేష్ తెలిపారు. పంచ్, నెక్సన్ సెగ్మెంట్ లీడర్లుగా ఉన్నాయని వెల్లడించారు. హారియర్, సఫారి ద్వయం ఇవి పోటీ పడుతున్న విభాగంలో రెండవ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ‘ఇతర కంపెనీలు కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేశాయి. ర్యాంకింగ్ మారుతూనే ఉంటుంది. ఇక్కడ నంబర్ వన్ అనేది స్పష్టంగా లేదు. ఈ సెగ్మెంట్లో తీవ్ర పోటీ ఉండబోతోంది. మొదటి మూడు–నాలుగు కంపెనీల అమ్మకాల వ్యత్యాసం కొన్ని వేల యూనిట్లు మాత్రమే. ఏదో ఒక సమయంలో ఎవరైనా నంబర్ వన్ అవుతారు. కొన్నిసార్లు మరొకరు నంబర్ టూ అవుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మా వద్ద ఉన్న నాలుగు ఎస్యూవీల్లో మేము అద్భుత పనితీరును కనబరుస్తున్నాము’ అని తెలిపారు. -
టాటా టెక్నాలజీస్లో వాటా అమ్మకం.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్లో 9.9 శాతం వాటా విక్రయించనున్నట్లు మాతృ సంస్థ, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. ఇందుకు టీపీజీ రైజ్ క్లయిమేట్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను దాదాపు రూ. 1,614 కోట్లుగా వెల్లడించింది. వెరసి రూ. 16,300 కోట్ల ఈక్విటీ విలువలో టాటా టెక్ వాటాను టీపీజీ రైజ్ కొనుగోలు చేయనుంది. డీల్ రెండు వారాలలో పూర్తికావచ్చని టాటా మోటా ర్స్ అంచనా వేస్తోంది. తాజా లావాదేవీ ద్వా రా రుణ భారాన్ని తగ్గించుకునే లక్ష్యంవైపు సా గుతున్నట్లు టాటా మోటార్స్ తెలియజేసింది. టీపీజీ రైజ్ ఇంతక్రితం వ్యూహాత్మక భాగస్వామిగా టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్లో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్ పరిశ్రమలో లోతైన(డొమైన్) నైపుణ్యాన్ని కలిగి ఉంది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు శుక్రవారం 5 శాతం జంప్చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
దేశీయ దిగ్గజం కొత్త స్క్రాపింగ్ ప్లాంట్ - ఏడాదికి 15,000 వాహనాలు తుక్కు.. తుక్కు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలో తన మూడవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) ప్రారంభించింది. గుజరాత్ సూరత్లో ప్రారంభమైన ఈ ఫెసిలిటీ పేరు Re.Wi.Re Recycle with Respect. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీలను భువనేశ్వర్, జైపూర్ ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు తన మూడవ ఫెసిలిటీని సూరత్లో ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి ఏటా 15,000 వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ఆర్విఎస్ఎఫ్ని టాటా మోటార్స్ భాగస్వామి శ్రీ అంబికా ఆటో అన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేస్తుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ.. Re.Wi.Re లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సూరత్లో ఈ ఫెసిలిటీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది! నిజానికి పాత వస్తువులు కాలుష్య కారకాలుగా మారతాయి. వీటిని తుక్కు కింద మార్చి మళ్ళీ రీ-సైకిల్ పద్దతిలో ఉపయోగిస్తారు. ఈ విధానంలో పనికిరాని వస్తువులు మళ్ళీ ఉపయోగించడానికి అనుకూలంగా మారతాయి. స్క్రాపింగ్ పాలసీ కింద 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కమర్షియల్ వాహనాలు & 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తుక్కు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర
భారతదేశంలో నేడు ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్ల ఉత్పత్తి & వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు దాదాపు డీజిల్ కార్ల మ్యాన్యుఫ్యాక్షరింగ్ నిలిపివేస్తున్నాయి. కాగా ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం మీద ప్రస్తావించారు. కానీ దీనిపై టాటా మోటార్స్ ఎండీ శైలేశ్ చంద్ర స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ వాహనాల ఉత్పత్తి నిలిపివేయాలని.. లేకుంటే డీజిల్ వెహికల్స్ మీద 10 శాతం జీఎస్స్టీ విధించడానికి తగిన సన్నాహాలు జరుగుతున్నాయని గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఈ మాటలపై శైలేశ్ చంద్ర స్పందిస్తూ.. మార్కెట్లో టాటా డీజిల్ వాహనాలకు డిమాండ్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని, 2024 నాటికి పూర్తి స్థాయిలో ఈ వాహనాల ఉత్పత్తి నిలిపివేసే లక్ష్యంగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా చాలామంది వాహన కొనుగోలుదారులు డీజిల్ వెహికల్స్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారని, దశల వారీగా వీటి ఉత్పత్తి తగ్గిస్తూ.. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నియమాలకు లోబడి ఉంటామని.. 2024 నాటికి డీజిల్ వెహికల్స్ ఉత్పత్తిని జీరో చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని శైలేశ్ చంద్ర వెల్లడించారు. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! ప్రస్తుతం కొన్ని విభాగాలలో మాత్రమే డీజిల్ మోడల్స్ ఉన్నాయి, వీటిని కూడా వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెర్షన్లోకి మార్చడానికి సన్నద్ధమవుతామని తెలిపారు. కాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా డీజిల్ ఇంజిన్ కార్లను తమ పోర్ట్ఫోలియోలో తొలగించడానికి ససేమిరా అంటోంది. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్లో పెట్రోల్, డీజిల్కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
అమ్మకాల్లో పెరిగిన మారుతి జోరు.. తగ్గిన టాటా మోటార్స్ సేల్స్
Car Sales 2023 August: 2023 ఆగష్టు నెల ముగియగానే దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఈ డేటా ప్రకారం దాదాపు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు తెలుస్తున్నాయి. గత నెలలో ఎక్కువ కార్లు విక్రయించిన సంస్థ ఏది? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కార్ల అమ్మకాలలో 2022 ఆగష్టు నెల కంటే 2023 ఆగష్టు నెలలో మారుతి సుజుకి 16.4 శాతం (165402 యూనిట్లు), మహీంద్రా అండ్ మహీంద్రా 19 శాతం వృద్ధి పొందినట్లు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో మొత్తం 70350 యూనిట్లను విక్రయించింది. ఇందులో 37270 యూనిట్లు దేశీయ విక్రయాలు కాగా.. మిగిలినవి విదేశీ ఎగుమతులు. మొత్తం మీద మహీంద్రా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3.5 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో 78,010 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఆగష్టు నెలలో 78,843 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇక టూ వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్స్ 5 శాతం వృద్ధిని నమోదు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. కాగా బజాజ్ ఆటో 31 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం మీద అమ్మకాల పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
వినాయక చవితి, విజయ దశమి, దీపావళి ఇలా.. రానున్నది అసలే పండుగ సీజన్. ఈ సమయంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెలలో (2023 సెప్టెంబర్) విడుదలకానున్న కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హోండా ఎలివేట్ హోండా కంపెనీ ఈ నెల 4న తన ఎలివేట్ కారుని విడుదల చేయనుంది. మిడ్ సైజ్ విభాగంలో చేరనున్న ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా అద్భుతమైన డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఉండనుంది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ 7 స్టెప్ CVT గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. వోల్వో సీ40 రీఛార్జ్ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది. కావున కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ కూపే విడుదల చేయనుంది. ఇది XC40 రీఛార్జ్పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫారమ్ ఆధారంగా రూపొందనుంది. 408 హార్స్ పవర్ అండ్ 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్ ఇందులో ఉంటుంది. ఒక సింగిల్ చార్జ్తో 418 కిమీ నుంచి 530 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల 14న నెక్సాన్ ఫేస్లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ కారు కర్వ్ & హారియర్ స్టైల్ కలిగి పెద్ద స్క్రీన్లు, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. నెక్సాన్ ఫేస్లిఫ్ట్ ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం మహీంద్రా బొలెరో నియో ప్లస్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల చివరలో బొలెరో నియో ప్లస్ విడుదల చేయనుంది. ఇది కంపెనీ మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ అండ్ 9 సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. 'మహీంద్రా బొలెరో నియో ప్లస్'కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టాటా ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త బ్రాండింగ్
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో పది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో టాటా మోటార్స్లో భాగమైన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ విద్యుత్ వాహనాలకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించింది. ’టాటాడాట్ఈవీ’ బ్రాండింగ్తో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నట్లు సంస్థ హెడ్ (మార్కెటింగ్) వివేక్ శ్రీవత్స తెలిపారు. కస్టమర్లకు మరింత వైవిధ్యమైన, అర్థవంతమైన అనుభూతిని అందించేందుకు ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. కంపెనీకి ప్రస్తుతం నాలుగు చక్రాల ఈవీల సెగ్మెంట్లో 70 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్–టీ పేరిట ఈవీలను విక్రయిస్తోంది. 2026 నాటికి పది కొత్త ఈవీలు ఆవిష్కరించే దిశగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2030 నాటికల్లా తమ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో విద్యుత్ వాహనాల వాటా సగానికి పైగా ఉంటుందని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ ఏడాది 1 లక్ష పైచిలుకు ఈవీలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్
Tata Nexon EV and Tigor EV: మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా వివిధ కార్ల తయారీదారుల నుండి కార్లపై ప్రయోజనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీలపై 80వేల దాకా తగ్గింపు లభిస్తోంది. టిగోర్ ఈవీ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టిగోర్ ఈవీ. టాటా మోటార్స్ దీని మీద రూ. 80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు,ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉండవచ్చు. దీని ధర రూ. 12.49-13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. నెక్సాన్ ఈవీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ. టాటా మోటార్స్ దీనిని వివిధ బ్యాటరీ పరిమాణాలతో ప్రైమ్ , మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. మాక్స్ , ప్రైమ్ వేరియంట్లపై రూ. 61,000 56,000 తగ్గించింది. వీటి ధర రూ. 14.49-17.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
RR vs PBKS: పంజాబ్పై రాజస్తాన్ గెలిస్తే!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement