-
‘నల్లసూరీడు’పై నజర్
● మూడు దశాబ్దాలుగా స్పష్టతలేని ఆదాయపు పన్ను మాఫీ ● మోక్షం లభించని కొత్తగనుల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కల్పన ● అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాజకీయ నేతల హామీలు గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. దీంతో వారిని మచ్చిక చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండు జిల్లాలు.. రెండు లక్షల ఓట్లు.. ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధి విస్తరించిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ● రామగుండం రీజియన్లో రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో సుమారు 12వేలకు పైగా పర్మినెంట్, 8వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● బెల్లంపల్లి రీజియన్లోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి నియోజవర్గాల్లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో 16వేలకుపైగా పర్మినెంట్ కార్మికులు, మరో 7వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● వీరి కుటుంబాలతో సహా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున లెక్కించినా సుమారు రెండులక్షలకుపైగా ఓట్లు ఉంటాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ● దీంతో వీరి ఓట్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ● ఉదయం బొగ్గుగనులపై గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ, సాయంత్రం కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ● మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నేతల తాకిడి ఈప్రాంతాల్లో పెరుగుతోంది. ● ఈనెల 3న మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నలుగుతున్న ఆదాయపు పన్ను మాఫీ.. సింగరేణి కార్మికులను సైనికులతో సమానంగా గుర్తిస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాము గెలిచిన వెంటనే ఆదాయపు పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే, గెలిచాక పార్లమెంట్లో కొద్దిరోజులు పోరాటం చేయడం, ఆ తర్వాత హామీ అటకెక్కించడం సర్వసాధారణంగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోంది. నూతన భూగర్భగనులు.. తాము గెలిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కొత్తగా భూగర్భ గనులు తవ్విస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అంటున్నాయి. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లపై దృష్టి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా.. నిరుద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తామని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయగా, రామగుండం నియోజవర్గంలోని గోదావరిఖనిలో మరో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. జాడలేని మారుపేర్ల మార్పు.. సుమారు 20ఏళ్లుగా నలుగుతున్న మారుపేర్ల మార్పుపై గత పాలకులు హామీలు ఇచ్చినా సింగరేణి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 400మందికి పైగా కార్మిక కుటుంబాల డిపెండెంట్ కేసులు కార్పొరేట్ కార్యాలయంలో నాలుగేళ్లుగా ముందుకు కదలడంలేదు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారిన ఈ సమస్యలకు గెలిచిన పార్టీలు పరిష్కారం చూపాలని కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
సింగరేణి ఉద్యోగుల రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గతంలో బీజేపీతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి సింగరేణి సంస్థ భవిష్యత్ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 7 లక్షల కోట్లు. ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల అప్పు కట్టాల్సిన ఆర్థిక సంక్షోభం కేసీఆర్ తీసుకొచ్చారు. పదేళ్ల లో అన్ని వ్యవస్థ లను విధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు వేశారు. మేము మార్చి 31 లోపు పూర్తి చేస్తామని చెప్పాం. కేటీఆర్, హరీష్రావులు అబద్దాలతోనే ఇంకా మోసం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకోకరు మాట్లాడడం లేదు. రోజు వారి ఆదాయాన్ని అంచనా వేసి చెల్లింపులు చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతే.. నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు. 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 6 న మరో 6 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ...అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగిపోయాక నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా. కృష్ణా నది జలాలు ఎవరు కేంద్రానికి అప్పగించారో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ,బీజేపీ పదేళ్ల లో ఇచ్చిన హామీలు, మా గ్యారెంటీలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించేందుకు సిద్దమా. బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, సంవంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిశాం. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఢిల్లీలో కాల్చి చంపారు. హైదరాబాద్ వరదలు వస్తే కేంద్రం సహాయం ఎందుకు చేయలేదు. రేపు సాయంత్రం 500లకు గ్యాస్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించబోతున్నాం. బీజేపీ, బీఆర్ఎస్లకు రాజకీయ స్వార్థం ఉంది . ...రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ,రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్. మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరిక్షలకు సిద్ధం అయ్యే వారికి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తాం. వైట్ రేషన్ కార్డు ప్రమానికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైవేలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కేటీఆర్ ఔట్ సోర్సింగ్ పర్సన్’అని సీఏం రేవంత్రెడ్డి అన్నారు. -
సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139, మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్) పోస్టులు 2, మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30, సబ్–ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నా యి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దర ఖాస్తులను స్వీకరించనున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్ (https://scclmin es.com) లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం సూచించింది. -
పీడితుల కోసమే జీవితం అంకితం
తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్ని అభినందించి, తన శాంతినికేతన్కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్ు హైదర్, రాజ బహు దూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు. మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్ఖాన్’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్ భవన్’ అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్’ నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు మఖ్దూమ్ జయంతి) -
హైడ్రో పవర్పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్కాస్ట్ మైన్స్లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్కాస్ట్లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు
-
SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది. -
సౌర వెలుగుల దిశగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు. ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి
-
ప్రశాంతంగా సింగరేణి ఎన్నికల పోలింగ్
-
కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
-
సింగరేణి ఎన్నికలు..గెలుపెవరిది ?
-
సింగరేణి సమరం.. కొనసాగుతున్న కౌంటింగ్
Singareni Elections 2023.. Updates రామగుండంలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. ఆర్జీ-1కౌంటర్లో పోలైన 5044 ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-2 కౌంటర్లో పోలైన 3369 ఓట్ల లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-3 కౌంటర్లో పోలైన 3612 ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. అర్ధరాత్రి వరకూ కొనసాగనున్న లెక్కింపు. ఆర్జీ-1కు సంబంధించి పోలైన 32 ఓట్ల బ్యాలెట్ బాక్స్ రావడం ఆలస్యం కావడంతో లేట్ గా ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. రామగుండం పరిధిలో ముందుగా వెలువడనున్న ఆర్జీ-2 ఫలితం. తుది ఫలితాల కోసం నెలకొన్న ఉత్కంఠ. అర్ధరాత్రి తర్వాత అధికార గుర్తింపు సంఘం ఎవరనేది తేలనున్న ఫలితం. కౌంటింగ్ ప్రారంభం మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491 పోలింగ్ శాతం 93.03 % నమోదు అయ్యింది.. బెల్లంపల్లి డివిజన్లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు... 96.29 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835 మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.. ముందుగా ఓట్లను యూనియన్ల వారీగా ఏర్పాటు చేసిన బాక్స్లో వేస్తారు. శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు. 13 యూనియన్ లకు 13 బాక్సులు ఏర్పాటు. 25 చొప్పున ఓట్లు కట్టలు కడతారు.. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ఐదుగురు.. మొత్తం తొమ్మిది టేబుల్ లకు 45 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా లో పారంభమైన సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ల్లో 96 శాతంపైగా నమోదైన పోలింగ్. ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ సెంటర్కు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు రంగం సిద్ధం. ఆర్జీ-1లో 5 టేబుల్స్, ఆర్జీ-2లో 3 టేబుల్స్, ఆర్జీ-3 లో 4 టేబుల్స్ పై కొనసాగనున్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు. రాత్రి 12 గంటలకల్లా వెల్లడి కానున్న ఫలితాలు.. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 95 శాతంకు పైగా నమోదైన పోలింగ్. అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్. 95 శాతం పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 37 వేల మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. గెలుపు పై ధీమాతో ఉన్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్లు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది.. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు... మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి గెలిచిన ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సాయంత్రం 5.00 గంటల వరకు మొత్తం 95 శాతం పోలింగ్ నమోదు 9127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8491. బెల్లంపల్లి డివిజన్లలో 985 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు. 96.3 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491.. పోలింగ్ శాతం 95% నమోదు.. మరికొద్ది సేపట్లో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 85.80 శాతం పోలింగ్ నమోదు. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న 34128 మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు. మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య రసవత్తరంగా జరిగిన ఎన్నికల పోరు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది. భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 3 గం. వరకు 86.15% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 4661 మంది ఓటర్లు. మంచిర్యాల: బెల్లంపల్లి ఏరియాలో 3 గంటల వరకు 88.4% పోలింగ్ నమోదు. శ్రీరామ్ పూర్లో 86.7 శాతం మందమర్రి 86.19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో 2pm గంటల వరకు 83.1 శాతం నమోదు... మొత్తం 985 ఓట్లకు గాను 819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఔ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లో మధ్యాహ్నం 3.00 గంటల వరకు 86.19 శాతం పోలింగ్ నమోదు. మొత్తం 4835 ఓట్లకు గాను 4166 ఓట్లు పోలయ్యాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓట్లు 26,815. పోలైన ఓటింగ్ శాతం 67.42 శాతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా: కొత్తగూడెం కార్పొరేట్ 887 ఓట్లు, నమోదైన పోలింగ్ 74.47%. కొత్తగూడెం ఏరియా 1,540 ఓట్లు నమోదైన పోలింగ్ 66.06%. ఇల్లందు 500 ఓట్లు, నమోదైన పోలింగ్ 81.56%. మణుగూరు 1,716 ఓట్లు నమోదైన పోలింగ్ 69.98% సింగరేణి వ్యాప్తంగా మధ్యాహ్నాం 12గం. వరకు నమోదు అయిన ఓట్లు 23,613 సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ 12 గంటల వరకు ఆర్జీ రీజియన్లో.. రామగుండం- 1లో 11 పోలింగ్ కేంద్రాల్లో 58.4 శాతం RG -2లో 6 పోలింగ్ కేంద్రాల్లో 50.09 శాతం RG-3 లో 6 పోలింగ్ కేంద్రాల్లో 60.24 శాతం మొత్తం 57 శాతం పోలింగ్ నమోదు భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 12 గం.ల వరకు 61% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 3,300 కార్మికులు ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు నమోదైన ఓట్లు 4,830 10 గంటలకు పోలింగ్ ఇలా.. ఇల్లందు ఏరియాలో 45 శాతంపైగా పోలింగ్ మణుగూరులో 36 శాతం జయశంకర్ భూపాలపల్లిలో 45 శాతం పోలింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో 42 శాతం పోలింగ్ మందమర్రి డివిజన్ లో 10 గంటల వరకు 34.93 శాతం పోలీంగ్ నమోదు మందమర్రిలో 4835 ఓట్లకు గాను 1689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు బెల్లంపల్లి ఏరియాలో అత్యధికంగా.. 10.00 గంటల దాకా 48.99 శాతం పోలింగ్ నమోదు రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ పరిధిలో.. 48.99 శాతం పోలింగ్ నమోదు సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులను కలుసుకుని మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటేసేందుకు కార్మికుల క్యూ ఉదయం విధులకు హాజరయ్యే కార్మికులతో మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకే పోలింగ్ ఓటేసేందుకు క్యూ కడుతున్న కార్మికులు రాత్రి 7గం. మొదలుకానున్న కౌంటింగ్ రాత్రి 11గం. కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం పెద్దపెల్లి రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఉదయం 9 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు. 8 గంటలకు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 8 గంటల వరకు ... తొలి గంటలో నమోదైన పోలింగ్ 21% పెద్దపల్లిజిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 13.5% మొత్తం 3884 ఓట్లకు గాను 528 మంది కార్మికుల ఓటు హక్కు వినియోగం కొమురం భీంలో 144 సెక్షన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి.. బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఎన్నికల హడావిడి మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఓటు హక్కు వినియోగించుకొనున్న 985 మంది సింగరేణి కార్మికులు నిరసన.. ఫిర్యాదు మంచిర్యాల శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గని నిరసన ఒక అధికారి ప్రచారం నిర్వహిస్తున్నాడని ఓ యూనియన్ నేత ఆరోపణ అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం పని? అంటూ ప్రశ్న పోలింగ్ హెల్ప్ డెస్క్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సదరు యూనియన్ లీడర్ జీఎం కార్యాలయం నుంచి ఐడెంటిటీ కార్డులు కొనసాగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి ఐడెంటిటీ కార్డ్ లేనివారు జీఎం కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచిస్తున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లా లో 11 ఏరియాల్లో పని చేస్తున్న 39వేల మంది మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఖమ్మంలో.. సింగరేణి ఎన్నికల్లో.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరి యాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కొత్తగూడెం ఏరియా రుద్రం పూర్, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లో మూడు చొప్పు న పోలింగ్ కేంద్రాలు.. ఐదు ఏరియాల్లో 6,587 మంది కార్మికులకు ఓటు హక్కు గట్టి పోటీ ఈ రెండు యూనియన్ల నడుమే! భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఐదువేల మంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా వివిధ గనులపై 09 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పోలింగ్ ను బ్యాలెట్ పేపర్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహణ పోలింగ్ అనంతరం కృష్ణ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్కు బ్యాలెట్ బాక్సుల తరలింపు రాత్రి 7 గంటల నుండి రౌండ్ కు 2,500 చోప్పున ఓట్ల లెక్కింపు చివరకు.. ఫలితాల వెల్లడి బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుందన్న ప్రచారంతో.. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే గట్టి పోటీ సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభం సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రారంభం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 84 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5గం. వరకు కొనసాగనున్న పోలింగ్ సాయంత్రం 7గం. నుంచి కౌంటింగ్ మొత్తం 39,809 మంది ఓటర్లు శ్రీరాంపూర్లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో ఐదు పోలింగ్ కేంద్రాలు బరిలో 13 కార్మిక సంఘాలు ఎన్నికల నుంచి తప్పుకున్న టీజీబీకేఎస్ AITUCకి మద్ధతు ప్రకటించిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ TBGKS(Telangana Boggu Ghani Karimka Sangham) కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని ప్రకటన నేడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ భూపాలపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,410 మంది కార్మికులు మొత్తం 09 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు బ్యాలెట్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ పోటీలో 13 గుర్తింపు యూనియన్లు ఎన్నికల్లో ఇలా.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిధులు, నియామకాల్లో నంబర్వన్గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఏరియాల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. తాజా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(బీఆర్ఎస్ టీజీబీకేఎస్ సపోర్ట్) మధ్య జరుగుతున్నాయి. సింగరేణి ఎన్నికల చరిత్ర ఇది.. సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ప్రభుత్వం.. సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుత) అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. -
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్వన్గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి. -
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
-
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్బాబు తెలిపారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
బీఆర్ఎస్ కు షాక్..టీబీజీకేఎస్ కు అగ్రనేతల రాజీనామా
-
సింగరేణి ఎన్నికల వాయిదాకు నో
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గురింపు సంఘం ఎన్నికల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిన విధంగా డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని స్పష్టంచేసింది. ఎన్నికల వాయిదా కోరుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్ర స్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావా లంటూ యాజమాన్యం సెపె్టంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని చెప్పింది. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల సంఘం పలు భేటీలు నిర్వహించనుందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఎన్నికల వాయిదాకు నిరాకరిస్తూ అక్టోబర్ 28న నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్సీసీఎల్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై నాడు విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. వాయిదాకు అంగీకరిస్తూ, డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున నాడు విచారణకు హాజరైన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కూడా ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ప్రభుత్వం అక్టోబర్లో సమ్మతించింది.. డిసెంబర్ 27న కూడా ఎన్నికలు నిర్వహించలేమని, మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ గత వారం ప్రభుత్వం ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొద్ది రోజుల క్రితమే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పోలీస్ అధికారుల బదిలీలు చేపడుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు అత్యంత కీలకమని, ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమంటూ వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్టోబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు నిరాకరించింది. అక్టోబర్లో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమ్మతిస్తూ తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ హామీ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. -
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను కొట్టేసింది. సింగరేణికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏడాది నుంచి హైకోర్ట్లో సింగరేణి ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్పై విచారణ జరుపుతూ వచ్చింది. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. చివరకు.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. -
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్పీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement