-
అరాచకం..!
- వర్సిటీ వద్ద వైఎస్సార్ సీపీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు - లోపలకు అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేత - అధికారుల తీరుపై మండిపాటు...అక్కడే ధర్నాకు దిగిన నేతలు - లోపాలను కప్పిపుచ్చుకొనేందుకే నిరాకరిస్తున్నారని ధ్వజం - గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బృందం సభ్యులు ఏఎన్యూ: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై జరుగుతున్న ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని, తప్పులను ప్రశ్నించటానికి వస్తే యూనివర్సిటీ గేటు బయటే అడ్డుకుంటారా అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ఈ ఘట నపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె పార్ధసారథి, వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాలు ఇన్చార్జి వీసీని కలిసేందుకు సోమవారం యూనివర్సిటీకి వచ్చారు. లోపలకు వెళ్లటానికి అనుమతి లేదని, వర్సిటీ ఉన్నతాధికారులు చెబితేనే అనుమతిస్తామని పోలీసులు, వర్సిటీ ఇంజినీరింగ్ సిబ్బంది వైఎస్సార్ సీపీ బృందాన్ని ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు. ఇన్చార్జి వీసీని కలిసేందుకు ఒక రోజు ముందుగానే అనుమతి తీసుకున్నామని వైఎస్సార్ సీపీ బృందం వీరికి తెలిపింది. విషయాన్ని రిజిస్ట్రార్కు తెలిపి వారు పంపమంటే పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఎంతకూ లోపలకు అనుమతించకపోవటంతో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నాయకులు బైఠాయించి ధర్నా చేశారు. యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ పోలీసులు, వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే యూనివర్సిటీలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుతున్నారని తేటతెల్లమవుతుందన్నారు. ఒకప్పుడు యూనివర్సిటీలోకి పోలీసులు రావాలంటే అధికారుల అనుమతి అవసరమని నేడు యూనివర్సిటీలోకి సామాన్యులు వెళ్లటానికి పోలీసుల అనుమతి కావాల్సి రావటం దురదృష్టకరమన్నారు.వర్సిటీలో కుల, మతతత్వం వేళ్లూనుకుందని, భారీగా నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరు గుతున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులను కలిసే వరకు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో కాలినడకన వెళ్లి ఉన్నతాధికారులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్లను కలసిన బృందం యూనివర్సిటీలో పోలీసు బలగాలను మొహరించాలని, రాకపోకల్లో ఆంక్షలు విధించాలని, విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కాపీలను చూపించాలని డిమాండ్ చేశారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ఆ ఆదేశాలను ప్రభుత్వం తరువాత లిఖిత పూర్వకంగా పంపుతామని చెప్పిందన్నారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉందని హాస్టల్ వార్డెన్ బహిరంగంగా చెప్పారని, ప్రిన్సిపాల్ బాబురావు మాత్రం అలాంటిదేమీలేదంటున్నారని వైఎస్సార్ సీపీ బృందం పేర్కొంది. వీటిపై యూనివర్సిటీ స్పందించకపోతే గవర్నర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్థసారధి బదులిచ్చారు. వర్సిటీకి వెళ్లిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు పార్ధసారథి, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, ఎమ్మెల్యే ముస్తఫా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాను గంటి చైతన్య, యువజన విభాగం నగర అధ్యక్షులు ఎలికా శ్రీకాంత్, నాయకులు మే రువ నర్సిరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, గులాంరసూల్, షేక్ జానీ తదితరులు ఉన్నారు. -
రిషితేశ్వరి కేసుపై అర్బన్ ఎస్పీ సీరియస్
- పెదకాకాని పోలీస్ స్టేషన్లో అధికారులతో సుదీర్ఘ సమీక్ష - వర్సిటీ పునఃప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ - నాన్బోర్డర్స్ ఎవరినీ హాస్టళ్లలోకి అనుమతించ వద్దని ఆదేశాలు - కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయం - బీఆర్క్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ పాత్రపై ప్రత్యేక ఆరా - నేడు వర్సిటీని సందర్శించనున్న వైఎస్సార్ సీపీ నేతలు సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసు దర్యాప్తు తీరు, సెలవుల అనంతరం విద్యార్థులు యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీరియస్గా దృష్టి సారించారు. వీటన్నిటిపై ఆదివారం పెదకాకాని పోలీస్స్టేషన్లో పోలీసు అధికారులతో ఆయన నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఛార్జిషీట్ దాఖలు, ఎంత మందిని విచారించారు వంటి అంశాలపై దర్యాప్తు అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే దానిపై ఎస్పీ ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని రిషితేశ్వరి మృతి అనంతరం వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయనే కారణంతో పది రోజుల పాటు ఇచ్చిన సెలవులు మూడో తేదీతో ముగియనుండటం, నాలుగో తేదీ నుంచి విద్యార్థులు రానున్నారు. దీంతో ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు నాన్బోర్డర్స్ ఎవరినీ హాస్టళ్లలోకి అనుమతించవద్దని యూనివర్సిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. యూనివర్సిటీలో సీసీ కెమేరాలు, యాంటీ ర్యా గింగ్ బోర్డులు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటుతోపాటు గుర్తింపు కార్డుల జారీ ఎంతవరకు వచ్చిందనే విషయంపై యూనివర్సిటీ అధికారుల నుంచి సమాచారం సేకరించా లని చెప్పారు. ఒక వేళ పనుల్లో జాప్యం జరుగుతుంటే ఎవరివల్ల జరుగుతుందో తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్పీ చెప్పినట్లు తెలిసింది. ఒక వేళ విద్యార్థులు ఆందోళనలు చేపడితే కళాశాలల్లో మిగిలిన విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ పరిస్థితులపై పూర్తిగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం యూనివర్సిటీని సందర్శించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ పలు సూచనలు చేసినట్లు సమా చారం. త్వరలో ప్రభుత్వ అధికారుల నివాసాలను యూనివర్సిటీ ఎదుట ఉన్న ఐజేఎం రెయిన్ట్రీ పార్కులోని అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించటంతో అక్కడ భద్రతా చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ప్రిన్సిపాల్ పాత్రపై పోలీసుల దృష్టి? రిషితేశ్వరి మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావు పాత్రపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కమిటీ విచారణలో కూడా రిషితేశ్వరి తల్లిదండ్రుల తోపాటు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ సిబ్బంది, ప్రజాసంఘాలు ప్రిన్సిపాల్పై పలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై పలు ఆరోపణలు రావటం, యూనివర్సిటీలో జరిగిన గొడవకు విద్యార్థులను రెచ్చగొట్టింది ప్రిన్సిపాలేననే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసు అధికారులు సైతం ఆయన పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రిన్సిపాల్ వ్యవహార శైలి, విద్యార్థులను అతను ఏమైనా వేధింపులకు గురిచేశాడా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్ర ఉన్నట్లు తేల్చే ఆధారాలు లభ్యమై తే అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు, మంగళగిరి డీఎస్పీ జి. రామకృష్ణ, ఎస్బి డీఎస్పీ సీతారామాంజనేయులు, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కమలాకరరావు, గుంటూరు తూర్పు డిఎస్పీ సంతోష్, పెదకాకాని సీఐ కె. శేషారావు, మంగళగిరి సీఐ కొంకా శ్రీనివాసరావు, ఎస్ఐ పి. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement