-
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్
సాక్షి, తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు.ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం’’ అని అనిల్ చెప్పారు.‘‘ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం చూస్తున్నారు. అధికార పార్టీకి కాస్త టైం ఇస్తాం. వారి తప్పులపై నిలదీస్తాం’’ అని అనిల్ పేర్కొన్నారు.‘‘తమిళనాడులో డీఎంకేకి నాలుగుసార్లు డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అంతే. రాజకీయ సన్యాసంపై నా ఛాలెంజ్ని టీడీపీ వారు స్వీకరించలేదు. కాబట్టి దాని గురించి ఇక నేను మాట్లడను. దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. కక్ష సాధింపు ఉండదని చెప్తూనే టీడీపీ దాడులు చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు’ అని అనిల్ పేర్కొన్నారు. -
నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మృతదేహానికి సోమవారం గుంటూరు జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు మేడికొండూరులో వారిని ఆపారు.సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్కు వివరించి తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని అతడికి తెలిపారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారకుడైన సీఐ రాజేశ్ కుమార్పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చేయకుండా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు మెత్తబడ్డారు. మృతదేహం ఉన్న వాహనంతో పాదయాత్రగా, ద్విచక్ర వాహనాలతో సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.అక్కడ సత్తెనపల్లి డీఎస్పీ జి.గురునాథ్ బాబు నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఈ సందర్భంగా మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభం, శుభం తెలియని తన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఊరు వదిలి పోవాలని బెదిరించారని ఆరోపించారు. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానని సత్తెనపల్లి రూరల్ సీఐ రాజేశ్ కుమార్ హెచ్చరించారని మండిపడ్డారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఇంటిపై దాడి చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన టీడీపీ, జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపే‹Ù, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్రెడ్డి, తదితరులు సందర్శించి నివాళులు అరి్పంచారు. -
బార్పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా?
పూర్వం యుద్ధం ముగిశాక విజయం సాధించిన రాజులు ఓడిపోయిన రాజు రాజ్యంపై పడి విధ్వంసం సృష్టించేవారు. జనావాసాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. అందినకాడికి దోచుకునేవారు. ప్రజలంతా ఒకచోటుకు చేరి.. మోకరిల్లి శరణుకోరాక కానీ శాంతించే వారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే అలాంటి దుస్థితే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడి భయోత్పాతం సృష్టిస్తున్నాయి.ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా విజయం సాధించాక తొలుత దృష్టి సారించాల్సింది శాంతి భద్రతల పరిరక్షణపైనే. అందుకు విరుద్దంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం కొనసాగిస్తుండగా... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా... తిరిగి వైఎస్సార్సీపీ కవ్వంపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైఎస్సార్సీపీ కవ్వంచినా సంయమనం పాటించాలంటూ ట్వీట్ చేయటం విధ్వంసాలకు మరింత ఊతమిచ్చేదిగా కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది... వచ్చామన్న కిక్కుతో ఊరూరా కవ్వంపులకు, దాడులకు తెగబడుతున్నది తెలుగుదేశమే.మూడు రోజులుగా వరుస దాడులు చేస్తున్నా పోలీసులకు పైనుంచి ఆదేశాలుండటంతో చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. తాను ప్రమాణ స్వీకారం చేసే వరకు ఏమైనా చేయండని, రెచ్చిపోండని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారని, అందుకే పోలీసులు పట్టనట్లు ఊరుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే తాను ప్రమాణ స్వీకారం చేయకముందయితే తన హయాంలో జరగలేదని చెప్పొచ్చనేది బాబు యోచనగా చెబుతున్నారు. -
నరసరావుపేటలో పేట్రేగిపోయిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో పచ్చమూకలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. గ్రామాలు వీడకుంటే పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలుచోట్ల హింస, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ మాజీ జడ్పీటీసీకి చెందిన బార్ను ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి మద్యం,నగదును టీడీపీ శ్రేణులు ఎత్తుకెళ్లారు.చంద్రగిరిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకల దాడి తిరుపతి: గత రెండు రోజులుగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ పార్టీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారికి చంద్రగిరి మాజీ శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చెప్పారు."ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చిన ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఏక పక్షంగా వ్యవహరించే పోలీసులకు కోర్టు ద్వారానే సమాధానం ఇద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా దాడులు చేయలేదని, తమకు ఆ సంస్కృతి లేదన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవ చేసామన్నారు. ఆపద అంటూ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నామే తప్ప గత ఐదు సంవత్సరాలలో ఒక్క టీడీపీ కార్యకర్తకు కూడా హాని తలపెట్ట లేదన్నారు. గత ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వారిపై దాడులు చేసుంటే ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. -
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హింసాత్మక చర్యలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. పోలింగ్ మరుసటి రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసం సృష్టించింది. కారంపూడిలో టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోయారు. ఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనని అంటోన్న వైఎస్సార్సీపీ.. సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది. కారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు పల్నాడు పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు. -
టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్
-
ఎన్నికల హింస కేసులో 54 మంది అరెస్టు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై గురువారం సిట్ కేసుల్లో 13 మందితో పాటు పోలింగ్కు ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఎన్నికల నేరాల్లో ఈ ఒక్క రోజే తొమ్మిది మందికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చామన్నారు. నరసరావుపేట సబ్ డివిజన్లో ఒకరు, సత్తెనపల్లి సబ్ డివిజన్ లో 46 మంది, గురజాల సబ్ డివిజన్లో 27 మందితో కలిపి 74 మందిని బైండోవర్ చేశామన్నారు.నరసరావుపేట సబ్ డివిజన్లో ఐదుగురిపై రౌడీషీట్స్ ఓపెన్ చేసి, ఎన్నికల సమయంలో ట్రబుల్ మాంగర్స్గా గుర్తించినట్లు ఎస్పీ గార్గ్ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు నోటీసులు ఇచ్చారు. 102 సీఆర్పీసీ సెక్షన్లో ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటుఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202వ పోలింగ్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కాలేజ్ జూనియర్ లెక్చరర్ పీవీ సుబ్బారావు, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూలు స్కూలు అసిస్టెంట్ షేక్ షహనాజ్ బేగంలను ఎన్నికల విధుల ఉల్లంఘన కారణంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లత్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్కు రూ.5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. -
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డి
సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు’’ అని కాసు మహేష్ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. -
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. -
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు: సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడు జరగలేదని మంత్రి అంబటి అన్నారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని.. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయారని.. వారికి భరోసా కల్పించి ఊరిలోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పల్నాడు, తాడిపత్రిలో హింస చెలరేగింది. అధికారులను మార్చినచోటే హింస చెలరేగింది. ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు చేశారు. ఎక్కడైతే పురేందేశ్వరి ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. చంద్రబాబు, పవన్, పురేందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేశారు. అధికారం రాదనుకున్నప్పుడే చంద్రబాబు హింసను ప్రేరేపిస్తాడు’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘పల్నాడు, తాడిపత్రిలో దాడులకు కారణం బాబు, పురందేశ్వరియే. కన్నా లక్ష్మీ నారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారు. సిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను. సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు. కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్లో ఉన్న సమయంలో టిప్పర్ను ఢీకొట్టింది. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం
-
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్ జరపాల్సిందే: మంత్రి అంబటి
సాక్షి, పల్నాడు జిల్లా: సీఎం జగన్ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారన్నారు. ‘‘పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది’’ అంబటి రాంబాబు అన్నారు.టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కైయ్యారా?’’ అంటూ అంబటి నిలదీశారు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు’’ అని అంబటి చెప్పారు.ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదు. పోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారు’’ అంబటి దుయ్యబట్టారు.దాడులు జరిగిన తర్వాత చాలాసేపటికి పోలీసులు వచ్చారు. నకిరేకల్ ఎస్ఐ నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదన్నారు. ఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. కానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారు. మీ అంతు తేల్చుతా అంటూ కన్నా కుమారుడు ఓటర్లను బెదిరించారు. రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడు. టీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడు’’ అని అంబటి నిప్పులు చెరిగారు.‘‘దమ్మాలపాడు బూత్లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారు. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాను. నా అల్లుడు ఉమేష్ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అథారిటీస్కి ఫిర్యాదు చేశాను. చంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన మొనగాడు జగన్. మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
అర్ధరాత్రి టీడీపీ విధ్వంసం..
-
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటమి ఖాయమని తేలిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు దగ్గరుండి తన అనుచరులు, బౌన్సర్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిపై దాడులు చేయించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కారు డ్రైవర్ హరితో పాటు ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి, మరో యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.టీడీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిముందు ఉన్న మూడు కార్లు, ఆయనకు చెందిన ఆస్పత్రి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో మధ్యాహ్నం 2గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న బూత్ లోపలికి టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబు, 20 మంది గూండాలు, బౌన్సర్లతో వచ్చారు. అంతకుముందు అదే బూత్కు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని మాత్రమే అనుమతించిన పోలీసులు ఇతర నాయకులను లోపలికి అనుమతించలేదు. అరవిందబాబు 20 మందితో రావటాన్ని బూత్లో ఏజెంట్గా ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు గంటెనపాటి గాబ్రియేలు ప్రశ్నించారు. దీంతో అరవిందబాబు గాబ్రియేలుపై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసులు అరవిందబాబుకు రక్షణ ఇస్తూ గాబ్రియేలు, అతడితో పాటు ఉన్న మరో నాయకుడు గోగుల మనోహరయాదవ్ను కొట్టారు. అరవిందబాబు బూత్ నుంచి బయటకు రాగానే అక్కడే కనిపించిన ఎమ్మెల్యే డ్రైవర్ హరిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తిరిగి వెళ్లిపోతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్దకు రాగానే ఆయన ఇంటిపైన, ఆస్పత్రిపైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా రాళ్లు, సీసాలు, కర్రలతో వారిపై టీడీపీ గూండాలు ఎదురు దాడికి దిగారు.పోలీసుల వ్యాన్లపై రాళ్లు వేశారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా లెక్కచేయని టీడీపీ గూండాలు మళ్లీ గోపిరెడ్డి ఇంటిపైన దాడికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. దాడులు చేయడానికి టీడీపీ గూండాలు, బౌన్సర్లు ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేత అరవిందబాబు ఒంగోలు, హైదరాబాద్, చెన్నైల నుంచి భారీ ఎత్తున బౌన్సర్లను రప్పించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నరసరావుపేటలోని తన ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. మారణాయుధాలతో మళ్లీ దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే హింసాత్మక సంఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. తనను కేవలం రెండుకార్లు మాత్రమే వాడాలని చెప్పి.. శ్రీకృష్ణదేవరాయలు మూడుకార్లు, అరవిందబాబు ఏడుకార్లతో తిరిగినా అధికారులు చూసీచూడనట్లుగా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట/రెంటచింతల/నరసరావుపేట/మాచర్ల: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడులో పచ్చ మూక పేట్రేగింది. ఓటమి ఖాయమని ముందే తెలిసిపోవడంతో ఓటర్లు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు, దళితులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో పల్నాడు జిల్లా రణరంగాన్ని తలపించింది. యథేచ్ఛగా టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినవారిని, అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని టీడీపీ నేతలు, కార్యకర్తలు చితకబాదారు. చివరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా విడిచిపెట్టలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు, డ్రైవర్పై, ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడి కారుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.నూజెండ్ల మండలంలో దళితులను చితకబాదారు. దాచేపల్లి మండలం కేశానుపల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని టీడీపీ నేతలు చావగొట్టారు. పాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తంగెడలో టీడీపీ నేతలు పెట్రోలు బాంబులతో దాడులు చేయడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చేష్టలుడిగి వేడుక చూశారు.దీంతో టీడీపీ మూక పల్నాడులో భయానక వాతావరణం సృష్టించింది. ముందస్తు ప్లాన్లో భాగంగా పెట్రోల్ బాంబ్లు, కర్రలు, రాళ్లు సమకూర్చుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి దాడులు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలలో బయటి ప్రాంతాల నుంచి బౌన్సర్లు, గూండాలను తీసుకువచ్చి దాడులు చేయించారు.మాచర్లలో భయానక వాతావరణం సృష్టించిన బ్రహ్మారెడ్డి..మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా ఫ్యాక్షన్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని తెచ్చిన చంద్రబాబు పోలింగ్ రోజు ఆయనతో బీభత్సం సృష్టించి.. ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. రెంటచింతల మండలం పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను కొట్టి లాగేశారని తెలిసి అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్పై బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ మూక దాడులు చేసింది. విచక్షణారహితంగా కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతం రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అదే మండలంలోని తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలపై విచక్షణారహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. తుమృకోటలో 5 ఈవీఎంలు, పాల్వాయి, జెట్టిపాలెంలలో ఒక్కో ఈవీఎంను ధ్వంసం చేశారు.కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. పొట్టి శ్రీరాములు కాలనీలో బూత్ వద్ద రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్తో పాటు పలువురికి తలలు పగిలాయి. వెల్దుర్తిలో పలు బూత్ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు లాగి పడేసి టీడీపీ రౌడీ మూకలు రిగ్గింగ్లకు పాల్పడ్డాయి.మర్సపెంటలో పుల్లారెడ్డి అనే అధికారిపై దాడి చేశారు. దుర్గి మండలం ముట్టుకూరులో టీడీపీ మూకల రాళ్లదాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గం పమిడిపాడులో టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ఓటర్లును పోలింగ్ కేంద్రానికి రాకుండా కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దొండపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. గురజాలలో గూండాగిరిదాచేపల్లి మండలం కేశానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న బొల్లా శ్రీనివాసరావు, ఆయన కుమారులు దిలీప్, మధు, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు పిడిగుద్దులు కురిపించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులు చేశారు. తంగెడలో పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో రెండు దుకాణాలు, నాలుగు బైకులు దగ్ధం కావడంతోపాటు 8 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లిలో మంత్రి అంబటితో సీఐ దురుసు ప్రవర్తనముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద మహిళలను సీఐ అన్యాయంగా కొట్టాడని ప్రశ్నించడానికి వెళ్లిన మంత్రి అంబటి రాంబాబుతో సీఐ రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. రివాల్వర్తో బెదిరించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు 20 మంది గూండాలతో దాడులకు పాల్పడ్డారు. ముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలను ధ్వంసం చేశారు. నకరికల్లు మండలం రూపనగుంట్ల, కుంకలగుంటలలో 8 మందికి గాయాలయ్యాయి.రాజుపాలెం మండలం గణపవరంలో టీడీపీ కార్యకర్తలు రాడ్డులు, కర్రలతో వైఎస్సార్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పెదకూరపాడు మండలం లగడపాడు, క్రోసూరు మండలం ఎర్రబాలెం, బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం, అచ్చంపేట మండలం మాదిపాడులో టీడీపీ మూకల రాళ్లదాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నూజెండ్ల మండలం పాతచెరుకుంపాలెం, జంగాలపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి చేయడానికి ప్రయత్నించారు.పోలీసుల ‘పచ్చ’పాతంప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేయాల్సిన పోలీసు శాఖ పచ్చపాతంతో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రౌడీలు, గూండాలతో టీడీపీ బీభత్సకాండ సృష్టించినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. సాక్షాత్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లపై దాడి చేస్తున్నా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పదుల సంఖ్యలో పోలీసులు, ఆర్మ్డ్ సిబ్బంది నియమించి టీడీపీ రిగ్గింగ్ చేసే గ్రామాల్లో మాత్రం ఒకరిద్దరు సిబ్బందితోనే సరిపెట్టారు.మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కుంకులగుంటలో డీఎస్పీ స్థాయి అధికారి అక్కడే ఉండి టీడీపీ ఏజెంట్లకు రక్షణ కల్పించారు. మాచర్ల చుట్టుపక్కలే ఉన్న ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు వైఎస్సార్సీపీ నేతలపై దాడులను నిలవరించలేకపోయారు. పోలింగ్ రెండు మూడు రోజుల ముందు టీడీపీ అరాచకాలను అడ్డుకుంటారని భావించిన పలువురు సీఐ, ఎస్ఐలను అక్కడి నుంచి బదిలీ చేయించారు. దీంతో టీడీపీ మూకలకు మరింత స్వేచ్ఛనిచ్చినట్టయింది. పోలింగ్కు ముందు 48 గంటల నుంచి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండటానికి వీల్లేదు.అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు, బౌన్సర్లు ఉన్నా పోలీసుశాఖ వారిని చూసిచూడనట్టు వదిలేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ కార్యకర్తల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పలుమార్లు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు విన్నవించుకొన్నా సరిగా స్పందించలేదని వాపోతున్నారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్పీ బిందుమాధవ్ స్పందించలేదని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు. -
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
అడ్డం తిరిగిన అరవింద్బాబు
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు అడ్డం తిరిగారు. తాను పార్టీకి డబ్బులు ఇవ్వడం కాదు. తనకు పార్టీ బీ–ఫారంతోపాటు డబ్బులు కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధిష్టానం ఆయనకు బీ–ఫారం ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్బాబు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయనకు బీ–ఫారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయినా అరవింద్బాబు లెక్క చేయకుండా బీ–ఫారం లేకుండానే ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి భయంతోనే తనను అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవింద్బాబు టీడీపీ అధిష్టానికి రూ.30 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉందని సమాచారం. అయితే వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో మరోసారి ఇక్కడ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. టీడీపీలోని ఓ ప్రధాన సామాజికవర్గం కూడా అరవింద్బాబుకు సహకరించడం లేదు. అదే సమయంలో ఇటీవల పట్టణంలోని 24వ వార్డులో వడ్డెర సామాజికవర్గ నేతలు అరవింద్బాబు కుమారుడిని తమ వార్డులోకి రావద్దని అడ్డుకున్నారు.అటు టీడీపీలో ముఖ్య సామాజికవర్గం సహకరించక, ఇటు బీసీలు ఆదరించక తాను ఎలా గెలవడమని అరవింద్బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయే సీటుకు రూ.కోట్లు ఎందుకు ఖర్చు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన కావాలనే డబ్బుల్లేవని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అభ్యర్థులందరికీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ–ఫారాలు అందించారు. అయితే అరవింద్బాబు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నరసరావుపేటకు చెందిన టీడీపీలోని ఓ ముఖ్య నేతకు రూ.30 కోట్లు ఇవ్వగానే బీ–ఫారం అందజేసేలా అధిష్టానం ఏర్పాట్లు చేసింది. డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటా? అరవింద్బాబు పంచాయితీని ఓ ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు అప్పగించారు. దీంతో ఇటీవల వారి మధ్య చర్చల సందర్భంగా ఇప్పటికే పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితిలో తాను లేనని అరవింద్ బాబు తేలి్చచెప్పినట్లు సమాచారం. బి.ఫారంతోపాటు ఖర్చులకు డబ్బులు ఇస్తేనే పోటీలో ఉంటానని, లేకపోతే మరో అభ్యరి్థని చూసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. అయినా అరవింద్బాబు పంచాయితీ తేలకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
టీ20 వరల్డ్కప్లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
వారెవ్వా సకిబ్.. నాలుగు ఓవర్లు.. 7 పరుగులు! 4 వికెట్లు
ఫైనల్లీ 'కల్కి' సాంగ్ వచ్చేసింది.. అదే కాస్త డిసప్పాయింట్!
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. బీజేపీకి సిద్ధరామయ్య కౌంటర్
ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది
ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యమే: శ్యామ్ పిట్రోడా
Advertisement