-
పొన్నూరు చేరుకున్న సీఎం జగన్
-
ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్
గుంటూరువెస్ట్: గుంటూరు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డికి టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పెమ్మసాని, రవిశంకర్ పెమ్మసాని నామినేషన్ పత్రాలు అందజేశారు. వీరితోపాటు బొమ్మసాని ముత్యాలరావు (ఆల్ పీపుల్స్ పార్టీ), షేక్ ఖాజావలి (ఇండిపెండెంట్), మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి పాషా (ఏపీ రాష్ట్ర సమితి) విష్ణురెడ్డి(బెంగళూరు నవ నిర్మాణ పార్టీ)లు నామినేషన్లు దాఖలు చేశారు. క్షమాపణలు చెప్పిన పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనచోదకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే వాహనచోదకులకు కలిగిన అసౌకర్యానికి పెమ్మసాని విలేకరుల ముందు క్షమాపణలు కోరారు. పోలీసులపై దురుసు ప్రవర్తన పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా కలెక్టరేట్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని పంపారు. వెనుకనే మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాళ్లు నరేంద్ర, తెనాలి శ్రావణ్కుమార్లు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సున్నితంగా అడ్డుకుని నచ్చజెప్పబోయారు. వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. మరో రెండు నెలలపాటే మీ ఆటలంటూ కోపంతో ఊగిపోయారు. అయితే పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. -
రేపు బలసాని కిరణ్కుమార్ నామినేషన్
గుంటూరురూరల్: మరోసారి జగనన్నే ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను అందజేసేందుకు బయలుదేరనున్నానని తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీగా బయలుదేరి ఏటుకూరు మీదుగా ప్రత్తిపాడులోని తహసీల్దారు కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నిమినేషన్ కార్యక్రమంలో పాల్గొని తనను ఆశీర్వదించాలని కోరారు. నేడు పేరంటాళ్లమ్మ కల్యాణం, తిరునాళ్లు వల్లభాపురం(కొల్లిపర): మండల పరిధిలోని వల్లభాపురం గ్రామంలోగల సర్విరెడ్డి పేరంటాలమ్మ దేవస్థానంలో మంగళవారం ఉద యం కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం శిడిమాను ఉత్సవం, తిరునాళ్ల ఉంటాయని పేర్కొన్నారు. భక్తులంతా అమ్మవారిని సందర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవాలని సభ్యులు కోరారు. ఏలూరి కో–ఆపరేటివ్ బ్యాంక్ శాఖ ప్రారంభం తెనాలి: ఏలూరి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖ సోమవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని దేవీచౌక్లో శాఖను కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ, తెనాలి చైర్మన్ డి.ఎల్. కాంతారావు ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంను పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, లాకర్లను నటరాజ్ జ్యూయలరీ అధినేత కొత్తమాసు కుమార్, బ్యాంక్ డైరెక్టర్ దత్త వెంకట కిరణ్ ప్రారంభించారు. 1999లో తమ బ్యాంక్ను ప్రారంభించినట్టు చైర్మన్ ఏలూరి గురవయ్య చెప్పారు. డైరెక్టర్లు వనమా నరేంద్రకుమార్, టి.శ్రీహరిరావు, సీఈవో కోట శ్రీనివాస్, చీఫ్ మేనేజరు ఎం.వి.ఆర్ శేషుకుమార్, రవిమోహన్ పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. 11వ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనివాస్ తెనాలిరూరల్: తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్వాగతం పలికారు. న్యాయమూర్తికి ఇటీవల కొత్తగా ఎన్నికై న బార్ అసోసియేషన్ కమిటీని పరిచయం చేశారు. -
అట్టహాసంగా మేకతోటి సుచరిత నామినేషన్
తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ఘట్టం కొనసాగింది. గుంటూరు నవభారత్నగర్ 4వ లైను నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడికొండ చేరడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నవభారత్ నగర్, విద్యానగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు మీదుగా లాడ్జి సెంటర్ వద్దకు చేరుకొని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామా బిల్డింగ్, నగరాలు, గోరంట్ల, లాం సెంటర్కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాం గ్రామస్తులు క్రేన్తో సుచరితకు భారీ గజమాలను వేసి సత్కరించారు. అనంతరం వాహనాల ర్యాలీ నడుమ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగా అక్కడ మేడికొండూరు మండలానికి చెందిన కొరివి అజయ్ ఏర్పాటు చేసిన భారీ గజమాలతో స్వాగతం పలకగా కార్యకర్తలు నాయకులు కదం తొక్కారు. అడ్డరోడ్డు కూడలి జనసంద్రంగా మారింది. డీజే బాక్సులు, పూల జల్లులతో అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె మేకతోటి రిషికతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొన్న మేకతోటి సుచరిత నామినేషన్ పత్రాలు ఆర్వో ఎం గంగరాజుకు అందజేశారు. నామినేషన్ ఘట్టానికి స్వచ్ఛందంగా 25 వేల మందికి పైగా హాజరయ్యారు. మండుటెండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యాకర్తలు భారీగా హాజరయ్యారు. రహదారులు జై జగన్, జై సుచరిత నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఎంపీ కిలారి వెంకట రోశయ్యతో కలిసి తాడికొండ షిర్డిసాయి పర్తి సాయిబాబా ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా రంగంలోకి దిగి తాడికొండ అడ్డరోడ్డులో వాహనాలను ముందుకు నడిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో కలసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న మేకతోటి సుచరిత గుంటూరు నుంచి జన ప్రవాహం అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరు కుమారుడు, కుమార్తెతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుచరిత -
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీ నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీసీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా దానబోయిన వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులుగా కొడాలి క్రాంతి, రాచమంటి గంగాధర్రావు, సున్నం మల్లికార్జునరావు, దానబోయిన శివశంకరరావు, కుంచాల శ్రీనివాసరావు, డి.మంగ, కార్యదర్శులుగా కడియం నాగేశ్వరరావు, జె.నాగమోహన్, పమిడి నరసింహారావు, పి.నాగేంద్రబాబబు, బలుసుపాటి వీరేంద్రకుమార్, ఆలా మహేష్, రాచకొండ వెంకటేశ్వరరావు, కె.పరమేశ్వరరావు, గుండు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా తుల్లిమెల్లి శ్రీనివాస్, కె.రామలింగేశ్వరరావు, కాకుమాను ఉమామహేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, ఎస్.జార్జిరాజు, బండి నాగరాజు, షేక్ మదరసా (షఫి), షేక్ జానీ, కేశన ఏడుకొండలు, కాకుమాను రవిప్రతాప్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ విభాగం కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్సీ విభాగ కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. విభాగం జిల్లా అధ్యక్షుడిగా పెరికల కృష్ణమోహన్, ఉపాధ్యక్షులుగా లింగాల మరియబాబు, బత్తుల వెంకట్రావు, కనపర్తి అనిల్, ప్రధాన కార్యదర్శులుగా డి.నరసింహారావు, జె.దాసు, మట్టిగుంట ప్రసన్నకుమార్, కొరగంటి ఉదయ్రాజు, దాసరి రత్నరాజు, సౌపాటి ప్రేమ్కుమార్, దేవరకొండ నాగేశ్వరరావు, జండ్రాజుపల్లి నాగేశ్వరరావు, ఉన్నవ ప్రశాంత, కార్యదర్శులుగా బత్తుల మరియన్న, పడాల దుర్గా, కుక్కమూడి అచ్చిబాబు, ఎం.రమేష్కుమార్, కె.బోయేజు, పిల్లి ధర్మరత్నం, మాతంగి ఆశీర్వాదం, కారుమూరి అంకమ్మరావు, గేరా సంజీవ్, టి.నరసింహారావు, ఎస్.నాగరాజు, గడ్డం మురారి, గంటా రమేష్, కె.విజయ్, సహాయ కార్యదర్శులుగా మేరిగ అమర్బాబు, మురికిపూడి రమేష్, దారం సాంబశివరావు, ఎం.బాలయ్య, చెరుకూరి నాగయ్య, శాంతకుమారి, రాయపూడి చినరాజు, కట్టెపోగు ఉదయభాస్కర్, వడ్డేశ్వరం రవి, కట్టవరపు ఆషాజ్యోతి, మాతంగి రవీంద్ర, కాకాని రవీంద్రబాబు, ఎం.సతీష్, మంచాల బిక్షాలు, గేరా చిన అంకయ్య, బుర్రి కిషోర్, నల్లపాటి బేబి, వై.ఇమ్మానియేల్ రాజు, దావులూరి పోతురాజు, గొరికపూడి జోసఫ్లను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షురాలిగా వెంకటరమణి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి వెంకటరమణిని పార్టీ వైఎస్సార్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈమేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. -
పదిలో మెరిసిన బాలికలు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఏడాది జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రైవేటు, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు, అత్యధిక ఉత్తీర్ణత నమోదు కావడం గొప్ప విషయం. గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరైన 27,178 మంది విద్యార్థుల్లో 23,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 14,223 మంది పరీక్షలు రాయగా, వారిలో 12,297 మంది ఉత్తీర్ణులై 86.46 శాతంగా నమోదైంది. బాలికలు 12,955 మంది పరీక్షలు రాయగా, వారిలో 11,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.99 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. వీరిలో 19,689 మంది ప్రథమ శ్రేణి, 3,031 మంది ద్వితీయ శ్రేణి, 1,235 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులున్నారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత టెన్త్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, జిల్లాలో 88.14 శాతంగా నమోదైంది. రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గతేడాది 77.40 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుత ఫలితాల్లో దిగజారింది. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. తరువాత జరిగిన రెండేళ్ల ఫలితాలతో పోల్చితే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానం దిగజారినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించిన విధానం, ట్యాబ్లు, ఐఎఫ్పీల ద్వారా ప్రవేశపెట్టిన ఆధునిక విద్యాబోధన, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉద్యోగోన్నతులతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన అంశాల ప్రభావం పదో తరగతి పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభావంతులుగా నిలిచారు. ప్రైవేటు, కార్పొరేట్తో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. స్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే టెన్త్ ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హైస్కూల్కు చెందిన తమలపాకుల అభినవ్ 600 మార్కులకు అత్యధికంగా 584 మార్కులను కై వసం చేసుకుని జిల్లా టాపర్గా నిలిచాడు. గుంటూరు రూరల్ యనమదల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు షేక్ రిహానా 583, షేక్ సమ్రీన్ 582, బాలనాగు మధుమిత 578 మార్కులు సాధించారు. గుంటూరు నగర పరిధిలో ఇజ్రాయిల్పేటలోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఫాతిమా తబసుమ్ 582 మార్కులతో నగర స్థాయిలో టాపర్గా నిలిచింది. వీరితోపాటు 550కు మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.టెన్త్ ఫలితాల్లో 582 మార్కులు కమ్మలూరి సాత్విక(జెడ్పీ హైస్కూల్, చినకాకాని, మంగళగిరి మండలం), సయ్యద్ మొహమ్మద్ (బీఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్, మంగళగిరి), కాసుల ఈశ్వరి(జెడ్పీ హైస్కూల్, శేకూరు, చేబ్రోలు మండలం), గంజి హర్షవర్ధన్ (ఎస్ఆర్ఎస్ మున్సిపల్ హైస్కూల్, తెనాలి), శృంగవరపు దీపిక(జెడ్పీ హైస్కూల్, గోగులమూడి, పెదనందిపాడు) సాధించారు. జిల్లాలో 88.14 శాతం ఉత్తీర్ణత నమోదు రాష్ట్రస్థాయిలో జిల్లాకు 16వ స్థానం స్థానం దిగజారినా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు అధిక మార్కులు సాధించిన పేదింటి ప్రతిభా కుసుమాలు -
పెమ్మసానిపై చర్యలు తీసుకోండి
నెహ్రూనగర్: టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేసే క్రమంలో రజకులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాత్రి పట్టాభిపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్న సమయంలో లౌడ్ స్పీకర్స్లో రజకులను కించపరిచే విధంగా పలుమార్లు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. రజకులను చాకలి అని అనకూడదని..అలా అంటే చర్యలు తీసుకోవాలని టీడీపీ హయాంలో ప్రత్యేకంగా జీఓ జారీ చేసిందన్నారు. కానీ రజకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ పెమ్మసాని కనీసం ఖండించకపోవడం బాధాకరమన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 63వేల ఓటింగ్ ఉన్న రజకులను కించపరిచిన పెమ్మసానికి రజకుల ఓటుతో తగిన బుద్ధి చెబుతామన్నారు. మాజీ ప్రభుత్వ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రజకులను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టాభిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అన్నదాన సత్రం చైర్మన్ పోకల వసంత్ రజక సామాజిక వర్గం అని చెప్పుకుని టీడీపీ తరుపున టికెట్ తెచ్చుకున్న గల్లా మాధవి.. అదే రజక సామాజిక వర్గాన్ని దూషిస్తుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఖండించకపోతే భవిష్యత్తులో రజకులకు ఏం న్యాయం చేయగలరని అన్నారు. ఈ విషయంపై పెమ్మసాని చంద్రశేఖర్ రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు టీడీపీ నాయకులు రజకులను దూషించిన అంశాన్ని కరపత్రాల రూపంలో రజకుల ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు. రజక సంఘాల నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, రామరావు, దుర్గ, బద్రినాథ్, గౌరి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. రజకులను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు 63 వేల ఓట్లు ఉన్న రజకులంతా కలిసి బుద్ధి చెబుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీడీపీ లోక్సభ అభ్యర్థిపై చంద్రశేఖర్పై పోలీసులకు ఫిర్యాదు -
టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీచైతన్య పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపినట్లు ఏజీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య సోమవారం తెలిపారు. నవభారత్నగర్లోని శ్రీచైతన్య క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరాలు క్యాంపస్కు చెందిన కొట్టా వాసవీ నాగ రాగ శ్రావ్య అత్యధికంగా 595, నవభారత్నగర్ క్యాంపస్ నుంచి కె.భవానీ, 594, కె.వరుణ్తేజ్ 593, ఎం.కౌషికా 592, వై. యశస్వి 592, జి.సాయి మహేష్ అక్షయ్ 591 మార్కులు సాధించినట్లు వివరించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఏజీఎం అంజయ్యతో పాటు ప్రిన్సిపాల్స్ రాధిక, శివప్రసాద్, కో–ఆర్డినేటర్లు ఏఎస్ఎన్ మూర్తి, డీన్లు రంజిత్, కేటీసీ ప్రసాద్, ఏవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. -
టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. జి. దీపికాశ్రీ 597, కె. వెంకటసాయి భావన 596, ఎండీ యాస్మిన్ షరీనా 596, ఎస్.గాయత్రి 595, కె.లక్ష్మీ హంసిని 595, ఎస్. ఆశ్రిత 595 మార్కులు సాధించారని చెప్పారు. భాష్యంలో పాఠశాల నుంచే అమలు చేస్తున్న షౌండేషన్ విధానం ద్వారా విద్యార్థులు ఐఐటీలతో పాటు జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీట్లు సాధించే స్థాయిలో బోధన అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని వివరించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయరాజు
పట్నంబజారు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి విజయరాజును నియమిస్తూ సోమవారం ఆదేశాలు వెలువడ్డాయి. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయరాజు తాడికొండ నియోజకవర్గానికి చెందిన నాయకులు. టీడీపీ అభ్యర్థులపై కేసు నమోదు గుంటూరు ఈస్ట్: టీడీపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో అనుమతి లేకుండా పార్టీ బ్యానర్ కట్టి ప్యారాచుట్ ఎగురవేసిన ఘటనపై కేసు నమోదు చేశారు. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాలు.. టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి, పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేసేందుకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అనుమతి లేకుండా పార్టీ బ్యానర్ కట్టిన ప్యారాచుట్ ఎగురవేశారు. దీనిపై ఎంసీసీ టీమ్ ఇన్చార్జి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ వైఎస్సార్ సీపీని ఆశీర్వదించాలి
తాడికొండ: సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య కోరారు. స్థానిక ఈఆర్వో కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎంపీ అభ్యర్థితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజల కోసం 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలను ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాల్లోకి చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని చెప్పారు. ఒక్క సారి రెండు బటన్లు నొక్కి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించమని జననేత వైఎస్ జగన్ అడుగుతున్నారని, ప్రజలందరూ ఆశీర్వదించాలని సుచరిత పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరువయ్యారని, అందుకే ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ ఆశీర్వదం అందిస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొని నామినేషన్లో పాల్గొనడం చూస్తే విజయం ఖాయమనే సంకేతాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మాయ చేయడానికి, దుష్ప్రచారం చేయడానికే పనికొస్తున్నారే తప్ప గతంలో వారు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితితో కూటమి ఎన్నికలకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. తాడికొండ అసెంబ్లీ అభ్యర్థి మేకతోటి సుచరిత, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య -
ప్రైవేటు వ్యక్తులు.. ఎన్నికల విధుల్లో..
ప్రత్తిపాడు: నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వాకంతో ప్రైవేటు వ్యక్తులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ప్రైవేట్ వ్యక్తులకు ఎన్నికల విధులు కేటాయించడమే కాకుండా, వారికి వీఆర్ఏ హోదా కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు జారీచేశారు. ప్రత్తిపాడులో వెలుగుచూసింది. వివరాలు.. ప్రత్తిపాడు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలో ప్రత్తిపాడుకు చెందిన కె.బాబూరావు, యనమదల గ్రామానికి చెందిన ఎమ్మెల కోటయ్యప్రైవేటు వ్యక్తులకు ఎన్నికల సిబ్బందిగా విధులు కేటాయించారు. అంతేకాకుండా వీఆర్ఏ హోదా ఇచ్చి గుర్తింపు కార్డులు జారీ చేసి దానిపై ఆర్వో సంతకం చేసి మరీ వారి చేతికిచ్చారు. ఒక పక్క ఎన్నికల సంఘం వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆర్వో శ్రీకర్కు మాత్రం అవేమీ పట్టన్నట్లుగా ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. దీంతో సదరు ప్రైవేటు వ్యక్తులు దర్జాగా నామినేషన్ల సమయంలోనూ మెడలో ఐడెంటిటీ కార్డులు వేసుకుని ఆర్వో కార్యాలయంలో చక్కర్లు కొట్టేస్తున్నారు. అయితే పై విషయమై ఆర్వో పి.శ్రీకర్ను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎన్నో సంతకాలు సంతకాలు పెడుతుంటాను. సంతకాలు పెట్టేటప్పుడు అన్నింటి మీదా డిజిగ్నేషన్ చూడలేను కదా. అయినా ఒక్కసారి అలా ఎవరికి ఇచ్చామో పరిశీలిస్తానని చెప్పారు. వీఆర్ఏ హోదాతో ఐడెంటిటీ కార్డులు జారీ చేసిన ప్రత్తిపాడు ఆర్వో శ్రీకర్ నామినేషన్ల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణీ ఆర్వో నిర్వాకంతో విస్తుపోతున్న సిబ్బంది, ఉద్యోగులు ఎన్నికల నియమావళికి ఇది పూర్తి విరుద్ధమంటూ విమర్శలు -
మెరిసిన ఆణిముత్యాలు
పాఠశాలలో సమకూర్చిన వసతులే కారణం.. మా స్వస్థలం గొట్టిపాడు. అమ్మా నాన్న అరుణకుమారి, మధుబాబు. కూలిపనులకు వెళుతుంటారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాలలో ఎటువంటి వసతులు లేవు. నాడు–నేడు ద్వారా మా పాఠశాలకు ఎన్నో సదుపాయాలు వచ్చాయి. డ్యూయల్ డెస్క్లు, ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు, టాయిలెట్లు వసతులు కల్పించారు. ముఖ్యంగా ఐఎఫ్పీల ద్వారా బోధన విధానంతో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు క్షుణ్ణంగా వివరించి చెప్పడం ద్వారా పరీక్షల్లో అధిక మార్కుల సాధనకు కృషి చేశాను. చెల్లెలు శ్రీజ ఇదే పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. త్రిపుల్ ఐటీలో సీటు సాధించి, ఇంజినీరింగ్ చదవాలనేది నా ఆశయం. – తమలపాకుల అభినవ్(584), జెడ్పీ హైస్కూల్, గొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అధిక మార్కులతో ప్రతిభావంతులుగా నిలిచారు. పాఠశాలల్లో అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మట్టిలో మాణిక్యాలుగా మెరిశారు. అమ్మానాన్నల కలను నెరవేరుస్తా.. నాన్న నాగేశ్వరరావు హోటల్లో పని చేస్తుంటారు. అక్క మధులిక ఇదే పాఠశాలలో టెన్త్ చదివి, ప్రస్తుతం త్రిపుల్ ఐటీలో చదువుతోంది. తన బాటలోనే త్రిపుల్ఐటీలో సీటు సాధించి, నన్ను విద్యావంతురాలిగా చూడాలనే ఆశ అమ్మానాన్నలకు ఉంది. వారి ఆశయాన్ని నెరవేరుస్తాను. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతోనే ప్రస్తుతం ఈ స్థాయిలో మార్కులు సాధించగలిగాను. – బాలనాగు మధుమిత (578), జెడ్పీ హైస్కూల్, యనమదల త్రిపుల్ ఐటీలో సీటు సాధిస్తా.. మా నాన్న మాబు సుభానీ, నల్లపాడులోని వెల్డింగ్ షాపులో పని చేస్తారు. 8వ తరగతిలో ఉండగా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాను. పాఠశాలలో ట్యాబ్లతో పాటు ఐఎఫ్పీల ద్వారా ఉపాధ్యాయులు చేస్తున్న బోధన ఎంతో బాగుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అధిక మార్కులను సాధించాను. త్రిపుల్ ఐటీలో చదవాలనే లక్ష్యంతో ఉన్నాను. – షేక్ రిహానా (583), జెడ్పీ హైస్కూల్, యనమదల ‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మార్కుల సాధన ప్రభుత్వం కల్పించిన వసతులు,అత్యుత్తమ బోధనే కారణమంటున్న విద్యార్థులు -
అఖండ హనుమాన్ చాలీసా పారాయణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుంటూరు జిల్లా పెనుమాకలోని వైష్ణవ మహా దివ్య క్షేత్రం ప్రాంగణంలో మంగళవారం నుంచి ఏడాది పాటు (365 రోజులు) అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్, దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23 చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు దివ్యక్షేత్ర ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. తొలిరోజు ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభాయాత్ర కనుల పండువగా నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన, 8.30కు హనుమత్ ఇష్టి ఉంటుందని తెలిపారు. కార్యసిద్ది హనుమాన్ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్ తాడికొండ శ్రీనివాసరావు, ఘట్టా ధనప్రసాదరావు, ఉమామహేశ్వరగుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భావన్నారాయణ పాల్గొన్నారు. -
పెమ్మసాని ఓ రాజకీయ అజ్ఞాని
మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి లక్ష్మీపురం: అమెరికాలో డబ్బు కూడా బెట్టి ఆ డబ్బుతో రాజకీయం చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వచ్చారని, పెమ్మసాని ఒక రాజకీయ అజ్ఞాని అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి షేక్ మస్తాన్వలి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెమ్మసాని అనే వ్యక్తి 30 ఏళ్లగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు వేసి ఎరగడని ఆరోపించారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ అడుగు పెట్టి గుంటూరు బాగు చేస్తానని చెబితే ఎవరు నమ్ముతారని అన్నారు. రేపటి రోజు గెలిచిన ఓడిన మీ కంటికి కనబడరని జోష్యం చెప్పారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలు గమనించి మీ అమూల్యమైన ఓటు అనే ఆయుధం డబ్బుతో రాజకీయం చేయడానికి వచ్చిన వ్యాపారస్తులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
పాఠశాలలో అందించిన బోధనతోనే...
మాది పేద కుటుంబం. నాన్న ఎండీ బాషా హోటల్లో పని చేస్తుంటారు. పాఠశాలలో అందించిన విద్యాబోధనతోనే ఎక్కువ మార్కులు సాధించాను. నాడు–నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ చేయడంతో పాటు అన్ని క్లాస్రూమ్స్లో ఏర్పాటు చేసిన ఐఎఫ్పీలతో పాఠాలను బోధించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంతో సులువైంది. ముఖ్యంగా సైన్స్ పాఠాలను ఐఎఫ్పీలతో టీచర్లు ఎంతో బాగా చెప్పేవారు. ఉన్నత చదువులు చదవాలనే కోరికగా ఉంది. – షేక్ ఫాతిమా తబసుమ్ (582), బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల, ఇజ్రాయిల్ పేట, గుంటూరు -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం తథ్యం
పట్నంబజారు: రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని శాసనమండలి విప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడిగా నియమితులైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ను శ్యామలానగర్లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ అప్పిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా.. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పని చేసే సమర్థ్ధుడైన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ని పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించటం ఎంతో సముచితమన్నారు. ఎమ్మెల్యేగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయన పనితీరుకు చక్కని నిదర్శనమన్నారు. అత్యంత కీలకమైన దశలో ఎమ్మెల్యే గిరి నేతృత్వంలో పార్టీ గుంటూరులో మరింత బలోపేతమై గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని, తూర్పులో షేక్ నూరి ఫాతిమా, ప్రత్తిపాడులో బలసాని కిరణ్కుమార్లు భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు. ● ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ కీలకమైన తరుణంలో తనను గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు గుంటూరు నగర పరిధిలోకి వచ్చే గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. నాయకులందరినీ కలుపుకొని పని చేస్తానన్నారు. కార్యకర్తలు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తానని తెలిపారు. మద్దాళి గిరికి పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి షేక్ నూరిఫాతిమా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), మోతుకూరి వెంకటరత్నం, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మద్దాళి గిరి నియామకం సంతోషదాయకం కార్పొరేషన్ పరిధిలో మంత్రి రజిని, నూరిఫాతిమా, బలసానిల గెలుపు ఖాయం శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి -
ఈతకు వెళ్లి ముగ్గురు దుర్మరణం
నాదెండ్ల: ఈత సరదా ముగ్గురు మృతికి కారణమైంది. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా కనపర్రు నుంచి సాతులూరు వెళ్లే మార్గమధ్యలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం, మొలకలూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గేరా పురుషోత్తం(20), బోరుగడ్డ ఆకాష్(20), చలమల రాజు(20) ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు కాలువలో దిగారు. కాలువ పక్కనే బైక్ను నిలిపి చెప్పులు, దుస్తులు, సెల్ఫోన్లు గట్టుపై పెట్టి కాలువలోకి దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న ఎండుగుంపాలెం వాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామ్రెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల మృతితో మొలకలూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురూ స్నేహితులే... మృతులు ముగ్గురు స్నేహితులు. వేర్వేరు పనులు చేసుకుని జీవిస్తుంటారు. గేరా పురుషోత్తం ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. తండ్రి రాజేష్ వ్యవసాయకూలి. బోరుగడ్డ ఆకాశ్ కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తండ్రి బాజీ కూలిపనులు చేస్తుంటాడు. చలమల రాజు తెలంగాణలోని నల్గొండ చెక్పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగే వేడుకకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఇంటికి చేరకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతుకులాట ప్రారంభించారు. కాలువలో మృతదేహాలున్నాయన్న సమాచారంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు. కనపర్రు – సాతులూరు మధ్య సాగర్ కాలువ వద్ద ఘటన -
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు
గుంటూరు రైల్వే డివిజన్ డీసీఎం ప్రదీప్ కుమార్ లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ గురువారం తెలిపారు. రైలు నంబరు 07791 కాచిగూడ – నడికుడి, రైలు నంబరు 07792 నడికూడి–కాచిగూడ రైళ్లను మే 6న రద్దు చేయడం జరిగిందని తెలిపారు. రైలు నంబరు 17646 రేపల్లె– సికింద్రాబాద్ రైలును మే 6 నుంచి పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. 07779 గుంటూరు–మాచర్ల, 07780 మాచర్ల– గుంటూరు, 07580 మాచర్ల– నడికుడి, 07579 నడికుడి – మాచర్ల, 17646 రేపల్లె–సికింద్రాబాద్, 17645 సికింద్రాబాద్– రేపల్లె రైళ్లను ఈ నెల 30న రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించాల్సిందిగా కోరారు. -
20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 20, 21 తేదీల్లో విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని మనసు ఫౌండేషన్ స్థాపకులు ఎం.వి.రాయుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందులో సాధారణ గ్రంథాలతో పాటు తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మిక, సాంఘిక, భాష, ఇంజినీరింగ్, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంథాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం తదితర విషయాలకు చెందిన పుస్తకాలే కాకుండా పదవ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన వివిధ విద్యా సంస్థల స్టడీ మెటీరియల్స్తో కలిపి దాదాపు 35 వేలకు పైగా పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పంపిణీ జరుగుతుందని చెప్పారు. విషయ ప్రాతిపదికగా విభజించి ప్రదర్శిస్తున్న ఈ పుస్తకాల నుంచి పౌరులు ఎవరైనా తమకు నచ్చిన రెండు పుస్తకాలను ఎంపిక చేసుకొని తీసుకెళ్లవచ్చని తెలిపారు. -
ఓట్ ఫ్రం హోం
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలునెహ్రూనగర్: లోక్సభ, రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న పోలింగ్ జరగనుంది. వేసవి కాలం కావడంతో జిల్లాలో ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో చెప్పాల్సిన పనేలేదు. ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలే ఓటింగ్ శాతం తక్కువ నమోదయ్యే పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వెళతారో తెలియదు. వయస్సు. ఆరోగ్యం ఉన్న వారే తటపటాయిస్తుంటే ఇక వృద్ధులు, దివ్యాంగుల గురించి చెప్పే పని ఉండదు. ఓటింగ్లో పాల్గొనాలని వీరిలో ఉత్సాహం ఉన్నప్పటికీ వయస్సు, వైకల్యం ప్రతిబంధకంగా ఉంటోంది. వీరిని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే వీరు బాధపడాల్సిన పని లేకుండా భారత ఎన్నికల సంఘం ఈ దఫా రాష్ట్రంలో కొత్తగా ఓట్ ఫ్రం హోమ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇందువల్ల ఓటింగ్ శాతం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ ప్యాండమిక్ నేపథ్యంలో 2020లో బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి వద్ద నుంచే ఓటు వేసే పద్ధతిని తీసుకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ కండక్ట్ ఆఫ్ ఎలెక్షన్ రూల్స్ – 1961కి. సవరణలు తీసుకొచ్చింది. ఓట్ ఫ్రం హోమ్ కార్యక్రమం కింద 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు, 40 శాతంపై బడి వైకల్యం ఉన్న పీడబ్ల్యూడీ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయనున్నారు. వైకల్యం ఉన్న వారు సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి ముందే అర్హులకు ఫాం–డీ ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందజేస్తారు. నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్ఓలకు సమర్పించాలి. బీఎల్ఓలు వాటిని తీసుకెళ్లి సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. పోలింగ్ కన్నా ముందే హోమ్ ఓటింగ్ ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి తేదీని నిర్ణయిస్తారు. అధికారులు పోస్టల్ బ్యాలెట్లను ఇళ్ల వద్దకే తెచ్చి అందజేస్తారు. ఐదుగురు పోలింగ్ సిబ్బంది. వీడియోగ్రాఫర్, పోలీసు రక్షణతో బ్యాలెట్ బాక్సు, కంపార్ట్మెంట్ సహా ఇంటి వద్దకు తీసుకొస్తారు. వృద్ధులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్లలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు నమోదు చేసి దాన్ని కవరులో ఉంచి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తారు. వృద్ధురాలికి ఫాం–డీ అందజేస్తున్న సిబ్బంది 85 ప్లస్ వయో వృద్ధులు, పిడబ్ల్యూడీ ఓటర్లకు అవకాశం రాష్ట్రంలో తొలిసారిగా అమలు నియోజకవర్గ కేంద్రంలోనే ఫెసిలిటేషన్ సెంటర్లు నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, అధర్ పోలింగ్ పర్సనల్స్ సుమారు 20 వేల మంది ఉండవచ్చని తెలుస్తోంది. ఇది ఇంకా ఆర్వోల నుంచి రావాల్సింది. గతంలో నిర్వహించిన తేదీన అందరూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లకు వచ్చి పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని తమ ఓటు వినియోగించుకునేవారు. ఇందువల్ల సమయం, డబ్బు వృథా అవుతుంది. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రాల్లోనే పోలింగ్ సిబ్బందికి ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర అత్యవసర విధులు నిర్వర్తించే శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తారు. అలాగే జైళ్లలో ఉండే రిమాండ్ ఖైదీలకు పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి
గుంటూరువెస్ట్: పార్లమెంట్తోపాటు, ఏడు నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయా లని గుంటూరు పార్లమెంట్ వ్యయ పరిశీలకుడు మిణల్ కుమార్దాస్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల వ్యయ పరిశీలకుడు రాధానాథ్ పురోహిత్, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకుడు వినోద్కుమార్ చంద్రబాన్తో కలిసి కలెక్టరేట్లోని ఎంసీఎంసీ, కమాండ్ కంట్రోల్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ఎన్నికల విధులు నిర్వహించే నోడల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిణల్ కుమార్ దాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం, నగదు, ఉచిత వస్తువులు పంపిణీ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ శాంతియుత ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జేసీ జి.రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తిచేకూరి, ఎస్పీ తుషార్ డూడీ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వ్యయ పరిశీలకుడు మిణల్ కుమార్ దాస్ -
No Headline
గుంటూరు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,72,022 మంది ఉన్నారు. వీరిలో పీడబ్ల్యూడీ ఓటర్లు సుమారు 14వేల దాకా ఉన్నారు. 85 ఏళ్లు, అంత కన్నా ఎక్కువ వయస్సున్న ఓటర్లు 31వేలు దాకా ఉన్నారు. వీరిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వికలాంగుల్లో కొంతమంది తాము నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకే వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటామనే వారు కూడా ఉండ వచ్చు. అది వారి నిర్ణయానికే వదిలేస్తారు. సమగ్ర మైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఓట్ ఫ్రం హోం కార్యక్ర మాన్ని చేపడుతోంది. -
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని గురువారం ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై హనుమ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ పట్టాభిషేకం విశేషాలను ఆలయ వేద పండితులు చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. పట్టాభిషేక కార్యక్రమానికి ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది హాజరయ్యారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాదాల పంపిణీ జరిగింది. దక్షిణామూర్తికి విశేష పూజలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద దక్షిణా మూర్తికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణామూర్తికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, ఈఓ కె.ఎస్.రామరావు పాల్గొన్నారు. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలను నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు. -
27న నగరానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా రాక
గుంటూరుఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఈనెల 27న గుంటూరు నగరానికి రానున్నట్లు ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సీఎస్ నాయుడు పేర్కొన్నారు. ఉదయం 7.00 గంటలకు బృందావన్గార్డెన్స్ నుంచి లాడ్జి సెంటర్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటర్ వరకు జరిగే విద్యార్థుల, యువజన ప్రదర్శనలో పాల్గొని సందేశం ఇస్తారని తెలిపారు. గురువారం ‘లెట్స్ ఓట్’ సంస్థ సభ్యులు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం వాకింగ్ ట్రాక్ వద్ద ప్లే కార్డులు, కరపత్రాలను పంచుతూ, చైతన్య గీతాలు ఆలపించారు. పీఎస్ నాయుడు మాట్లాడుతూ ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛతోపాటు సుపరిపాలనకు, తమ అభివృద్ధికి, సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సంస్థ ప్రజలను, యువ ఓటర్లను జాగృతం చేస్తుందని వివరించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు బుల్లి కుమార్, జీవిత బీమా సంస్థ యూనియన్ నాయకులు సీతా రమేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో మే 10 వరకు అపార్ట్మెంట్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్స్ వంటి చోట్ల ప్రతిరోజూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రొఫెసర్ ఎం.మాలకొండయ్య, టి.బాలాజీ శ్రీనివాస్ ఉన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement