టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

Published Tue, Apr 23 2024 8:25 AM

విద్యార్థిని శ్రావ్యను అభినందిస్తున్న 
ఏజీఎం అంజయ్య, ప్రిన్సిపాల్స్‌  - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీచైతన్య పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపినట్లు ఏజీఎం డాక్టర్‌ నూతలపాటి అంజయ్య సోమవారం తెలిపారు. నవభారత్‌నగర్‌లోని శ్రీచైతన్య క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరాలు క్యాంపస్‌కు చెందిన కొట్టా వాసవీ నాగ రాగ శ్రావ్య అత్యధికంగా 595, నవభారత్‌నగర్‌ క్యాంపస్‌ నుంచి కె.భవానీ, 594, కె.వరుణ్‌తేజ్‌ 593, ఎం.కౌషికా 592, వై. యశస్వి 592, జి.సాయి మహేష్‌ అక్షయ్‌ 591 మార్కులు సాధించినట్లు వివరించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఏజీఎం అంజయ్యతో పాటు ప్రిన్సిపాల్స్‌ రాధిక, శివప్రసాద్‌, కో–ఆర్డినేటర్లు ఏఎస్‌ఎన్‌ మూర్తి, డీన్లు రంజిత్‌, కేటీసీ ప్రసాద్‌, ఏవో శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement