మార్చి 17 నుంచి మిజోరం అసెంబ్లీ బడ్జెట్
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 17న ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర గవర్నర్ అజిజ్ ఖురేషి తెలిపారు. బడ్జెట్ సమావేశాలపై ప్రణాళికను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఆర్థిక మంత్రి లాల్ సత్వా బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2015-16కు సంబంధించి పూర్తి బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.