-
ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకుంటాం
మర్రిగూడ (మునుగోడు) : జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితులకు పోలీస్ శాఖ జనమైత్రి కార్యక్రమం ద్వారా ఆదుకుంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. గురువారం మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్ను పరిశీలించారు. గతంలో ఈ రిజర్వాయర్ వద్ద ముంపు బాధితులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై పలు వివరాలను సేకరించారు. అనంతరం మండలంలోని ఖుదాభ„Š పల్లి గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితురాలు బొమ్మగాని సింధును ఆయన పరామర్శించారు. ఈమెకు రెండు కాళ్లు పనిచేయకపోవడంతో నడవలేక పోతుంది. ఈమెకు వైద్య ఖర్చు రూ.ఏడు లక్షలను తమ శాఖ నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు. నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐలు కొండల్రెడ్డి, నాగభూషణ్రావు, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్, సదుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘ప్రకృతి అనుసంధానంతోనే’ మానవాళికి మనుగడ
– ‘అనంత’పై ఫ్లోరోసిస్ ప్రభావం – ఎస్కేయూలో విస్తృత పరిశోధనలు – నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులతో మానవాళికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్యావరణ ముప్పును అన్ని దేశాల ప్రతినిధులు గమనిస్తూనే ఉన్నా.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై అవగాహన పెంచేందుకు 1974 నుంచి ప్రతి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తలపెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ప్రకృతితో ప్రజల అనుసంధానం’ అనే నినాదంతో పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రకృతితో అనుసంధానం కావడం ద్వారానే మానవాళి మనుగడ ఉంటుందనే విషయంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. - ఎస్కేయూ అనవసరపు వృథా, ఆహారపు కొరత, గ్లోబల్ వార్మింగ్, చెట్లు నరికివేత, కాలుష్యం, పారిశ్రామీకీకరణ... తదితర అంశాల ఆధారంగా కలిగే నష్టాలను మానవాళి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన లోపం.. ప్రెచ్ఛరిల్లిన స్వార్థంతో భూమి మీద 45 శాతం అడవులు అంతరించిపోయాయి. దీని వల్ల 20 శాతం కార్బన్డయాక్సైడ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కలుషిత నీరు సేవించడం వల్ల ప్రతి గంటకూ పది మంది శిశువులు మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం వాయుకాలుష్యం వల్ల ఏటా 24 లక్షల మంది మరణిస్తున్నారు. తాగునీరే ప్రధానం ప్రతి మానవుడు రోజుకు సగటున మూడు లీటర్ల నీటిని తాగాలి. ప్రాంతాన్ని బట్టి ఈ పరిమాణం మారుతూ ఉంటుంది. మనిషి తాగిన నీరు అన్నవాహిక పీల్చుకుని రక్తంలో కలిసేలా చేస్తుంది. దీంతో హైపోథాల్మస్ చురుకుగా పనిచేస్తుంది. నీరు తక్కువగా సేవిస్తే తలనొప్పి, శక్తి హీనత, నడువలేని స్థితికి మనిషి చేరుకుంటాడు. తాగునీరంటే కేవలం మంచినీరే కాదు.. ఒక లీటర్ నీటిలో కరిగిన వాయువులతో పాటు కాల్షియం, మెగ్నీషియం, సోడియం, జింక్, రాగి, ఫ్లోరైడ్, నైట్రేట్... తదితర మూలకాలు తప్పని సరిగా ఉండాలి. అనంతపై ఫ్లోరిసిస్ ప్రభావం నీటికి ఒక నిర్ణీత పీహెచ్ (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) విలువ ఉంటుంది. ఇది 7 నుంచి 8.5 యూనిట్లలో ఉంటే ఆమోదయోగ్యమైంది. పీహెచ్లో తేడాలుంటే ఆ నీరు తాగేందుకు యోగ్యమైంది కాదని గుర్తించాలి. తాగునీటిలో మిలియన్ల భాగాలలో ఒకటిన్నర భాగానికి మించి ఫ్లోరైడ్ ఉండరాదని ఆంక్షలున్నాయి. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే అది సులువుగా కాల్షియం ఖనిజంలో కలుస్తుంది. ఈ నీటిని తాగితే ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఫ్లోరైడ్ ప్రభావం వల్ల దంతాలు, ఎముకలు గట్టిపడి కీళ్లనొప్పులు వస్తాయి. కండరాల పొరల్లో కూడా ఫ్లోరైడ్ పేరుకుపోయి గట్టిగా మారిపోతాయి. దీని వల్ల వీటికి ఆక్సిజన్ తీసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. ఒక లీటరు తాగునీటిలో 1.5–2.0 మిల్లీ గ్రాముల ఫ్లోరైడ్ ఉంటే దంత క్షయం, 4 నుంచి 8 మిల్లీ.గ్రాముల ఫ్లోరైడ్ ఉంటే కాళ్లు వంకర, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. జిల్లాలోని 63 మండలాల్లో నాలుగు మిలియన్ల ప్రజల్లో.. మూడు మిలియన్ల మంది భూగర్భం నుంచి లభ్యమయ్యే నీటినే తాగుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఫ్లోరైడ్ శాతం 3.0 మి.గ్రా/ లీటర్ కంటే ఎక్కువగా ఉందని పరిశోధనల ద్వారా తేలింది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం కూడా ఫ్లోరైడ్ ప్రభావమేనని పరిశోధనల ద్వారా రుజువైంది. ఎస్కేయూ ఫిజిక్స్ విభాగంలో విస్తృత పరిశోధనలు నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని గుర్తించడం.. దాని ప్రభావం నుంచి ప్రజలను బయటపడేసే దిశగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగంలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజూరి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ నీటిని సేకరించి దానిపై సంపూర్ణంగా అధ్యయనం చేశారు. తాగునీటిలో అధికంగా ఉన్న ఫ్లోరైడ్ శాతంపై నివేదికను తయారుచేసి భారత ప్రభుత్వానికి పంపించారు. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఆర్థిక సహకారంతో ఫిజిక్స్ విభాగంలో స్థానిక వాతావరణంలో జరుగుతున్న మార్పులపై కూడా అధ్యయనం చేస్తున్నారు. ఫ్లోరైడ్ అత్యంత ప్రభావం జిల్లాలోని ప్రాంతాలు ప్రాంతం లీటరు తాగునీటిలోఫ్లోరైడ్ శాతం కొట్టాలపల్లి 4.52 రాశింపల్లి తండా 3.79 బిట్రుగుంట పల్లి 7.21 గురివిరెడ్డి పల్లి 4.70 వెంకటాపురం 5.24 మారాల 4.29 చిన్న చెరువు తండా 4.02 నారశింపల్లి తండా 4.21 కొత్తకోట 3.82 పాముదుర్తి 3.05 సిద్దరాంపురం 2.69 ముదిరేబైలు 2.71 నాయినపల్లి 2.78 కర్ణాటకనాగేపల్లి 3.25 ఆమాగొండ పాళెం 3.79 బీడుపల్లి 3.54 గంగిరెడ్డి పల్లి 3.78 దిగువు చెరువుపల్లి 3.70 బుగ్గపల్లి 3.01 రాచువారిపల్లి 3.53 రాయల వాండ్లపల్లి 4.48 ఐరగరాజు పల్లి 3.61 బుక్కరాయసముద్రం 2.80 ధర్మవరం 2.40 నల్లమాడ 3.40 వంకరకుంట 3.90 సానేవారిపల్లి 3.90 వేలమద్ది 3.50 కురుమాల 3.70 చారుపల్లి 3.40 దొన్నికోట 2.80 పులగంపల్లి 2.60 గోపేపల్లి 3.10 ముదిగుబ్బ 3.60 రాళ్ల అనంతపురం 4.60 మంగల మడక 3.0 మలకవేముల 2.80 ఉప్పలపాడు 2.90 జొన్నల కొత్తపల్లి 2.80 తిమ్మనాయని పాలెం 3.70 గుంజేపల్లి 2.40 పుట్టపర్తి 1.28 బుక్కపట్నం 1.76 బచ్చయ్యగారి పల్లి 1.45 ఆకుతోటపల్లి 0.60 ఉరవకొండ 1.45 కళ్యాణ దుర్గం 0.50 తాడిపత్రి 0.60 బొమ్మేపర్తి 0.50 తలుపుల 0.81 రెడ్డిపల్లి 0.60 అనంతపురం కొత్తూరు 1.1 కోర్టు రోడ్డు 0.40 పాతూరు 0.80 సాయినగర్ 0.80 రాంనగర్ 0.60 సప్తగిరి లైన్ 0.60 టీవీ టవర్ 0.80 ముదిగుబ్బ మండలంలో పచ్చటి బ్రౌన్స్, చాకీవైట్ రంగుల్లో దంతాలు కలిగి ఉన్న వారి సంఖ్య 24 శాతం, నల్లమాడ మండలంలో 20 శాతం, కదిరి మండలంలో 22 శాతం మంది ఉన్నారు. నీటిలో నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువగా ఉన్న ఫ్లోరైడ్ను తగ్గించుకునేందుకు పటిక, సున్నపుముద్ద, బ్లీచింగ్ పౌడర్ తగు మోతాదులో లీటర్ నీటిలో కలిపి ఒక గంటకు పైగా కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత పైనీటిని వేరు చేసి తాగాలి. ఒక లీటరు తాగు నీటిలో 1.5 మిల్లీగ్రాముల కంటే ఫ్లోరైడ్ తక్కువగా ఉంటే .. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ల వాడకం తగ్గించాలి. టుబాకో, పొగ సేవించడం మానివేయాలి. పాన్పరాగ్, చూయింగ్గమ్లను తీసుకోకూడదు. – ప్రొఫెసర్ రాజూరి రామకృష్ణా రెడ్డి, ఎస్కేయూ
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement