-
'ప్రసన్న వదనం'థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్, డౌటే లేదు: సుహాస్
‘ప్రసన్న వదనం’ ఫస్ట్ కాపీ నిన్ననే చూశాను. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు.ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది’ అన్నారు హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి’ అని కోరారు. ‘ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు దర్శకుడు అర్జున్. ‘ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు హీరోయిన్ రాశిసింగ్. ‘ ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం’ అని నిర్మాతలు ప్రసాద్ రెడ్డి, జెస్ మణికంఠ అన్నారు. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్కు చెందిన జీవన్ నెడున్జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్జెవ్స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత నంబర్వన్గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత కొత్త నంబర్వన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!
బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే.. కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) ఎందుకు వస్తుందంటే.. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 24 గంటల నొప్పి అనడానికి రీజన్.. సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు. ఎలా గుర్తిస్తారంటే.. అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు. సర్జరీ తప్పదా అంటే.. చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ.. ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది. (చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!) -
అర్జున్కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జియాంగ్జి బు (చైనా), యాంగీ యు (చైనా), అర్జున్ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... జియాంగ్జి టైటిల్ గెల్చుకోగా... యాంగీ యు రన్నరప్గా నిలిచాడు. అర్జున్కు మూడో స్థానం ఖరారైంది. ఏడు గేమ్లు ఆడిన అర్జున్ మూడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోయాడు. -
కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ‘హస్తం’ ఎమ్మెల్యే!
కాంగ్రెస్ ‘హస్తం’ నుంచి మరో ఎమ్మెల్యే చేజారిపోయారు. గుజరాత్లో కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా తాజాగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ బడానేతలు కూడా బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ ధేర్, ములుభాయ్ కందేరియా ఉన్నారు. గుజరాత్లో బలమైన ప్రతిపక్ష నేతగా మోద్వాడియా పేరు సంపాదించారు. 2022 ఎన్నికల్లో పోర్బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత బాబు బోఖిరియాను ఓడించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మార్చి 7న గుజరాత్లోకి ప్రవేశించబోతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం చర్చనీయాంశంగామారింది. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్తో అనుబంధం కలిగిన మోద్వాడియా .. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని పార్టీ అధిష్టానం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. మోద్వాడియా ప్రస్తుతం పోర్బందర్ ఎమ్మెల్యే. కాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరీష్ దేర్ కూడా బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా దేర్ను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్ సస్పెండ్ చేశారు. #WATCH | Gandhinagar | Senior leaders from Gujarat Arjun Modhwadia, Ambrish Der, and others - who resigned from the Congress yesterday - join BJP in the presence of State BJP chief CR Paatil. pic.twitter.com/ioOe5K2cnD — ANI (@ANI) March 5, 2024 -
ఆయన మాటల వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే: విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వరుసగా రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం 'గామి' రిలీజ్కు సిద్ధమైంది. అఘోరాగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా కొద్ది గ్యాప్లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్సేన్. ఒకరు చేసిన పని వల్ల తాను చాలా నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా ప్రారంభమైన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అప్పట్లో అర్జున్ ప్రెస్మీట్ పెట్టి విశ్వక్సేన్ కమిట్మెంట్ లేని నటుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో టాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విశ్వక్ ఈ విషయం గురించి పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్ ఇలా రియాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది..? సినిమాని క్యాన్సిల్ చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కరోజు షూటింగ్ మాత్రమే ఆపమని కోరాను. ఆ సమయంలో ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. మా అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి కూడా చేశారు. ఆ విషయాలు ఎవరికీ తెలియదు. నాకు సినిమా నేపథ్యం లేదనో, మరేదో కావచ్చు అనుకుని అనుకుని మీడియా సమావేశం పెట్టారు. కానీ ఆయన మీద గౌరవంతో దానిని మళ్లీ సాగదీయాలనుకోలేదు. ఆ అంశంపై నేను ఎందుకు సమాధానం చెప్పాలి.. ఆ అవసరం కూడా లేదు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి నేను తీసుకున్న రెమ్యునరేషన్కు రెట్టింపు తిరిగిచ్చేశాను. నాపై కోపంతో ఆయన చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే.' అని విశ్వక్ అన్నారు. హీరోగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విశ్వక్.. నిర్మాతగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. కానీ మార్చి 8న రానున్న గామి చిత్రంపై ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ సుమారు నాలుగేళ్ల పాటు జరిగింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. -
వాచ్మెన్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా: మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్యపై మేస్త్రి అర్జున్ దాడి చేశాడు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న జంగయ్య స్క్రాప్ అమ్ముకుంటున్నాడని కోపంతో మేస్త్రి అర్జున్ దాడి చేశాడు దాడిలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు మేస్త్రి అర్జున్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'
డైరెక్టర్స్ రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారుహాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్కు చెందిన బోల్డ్ అండ్ బ్యూటీ మోడలింగ్ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్ విజయ్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్సీరీస్లో నటించారు. అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ అమీజాక్సన్ను కోలీవుడ్కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అరుణ్విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్ లండన్కు చెందిన పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించడం విశేషం. అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్ చాప్టర్ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్ హీరోయిన్గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్ హీరోయిన్గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్ పేర్కొన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్కు ఆరో ర్యాంక్, అరోనియన్కు ఏడో ర్యాంక్, డెనిస్కు ఎనిమిదో ర్యాంక్లు ఖరారయ్యాయి. భారత్కే చెందిన ఇతర గ్రాండ్మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్లో, నారాయణన్ 35వ ర్యాంక్లో, గుకేశ్ 38వ ర్యాంక్లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్ 13వ ర్యాంక్లో, కోనేరు హంపి 17వ ర్యాంక్లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్లో, వైశాలి 36వ ర్యాంక్లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్లో నిలిచారు. -
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
Aishwarya-Umapathy Engaged: ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
భారత షూటర్ల జోరు
చాంగ్వాన్ (కొరియా): ఆసియా చాంపియన్షిప్లో భారత రైఫిల్ షూటర్లు అర్జున్ బబుతా, తిలోత్తమ సేన్ రజత పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో భారత్కు రెండు ఒలింపిక్స్ కోటా బెర్త్లు దక్కాయి. ఇప్పటికే భారత షూటర్లు 8 బెర్తులు పొందారు. దీంతో వచ్చే ఏడాది పారిస్కు పయనమయ్యే షూటర్ల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 24 ఏళ్ల అర్జున్ 251.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్రైఫిల్ ఫైనల్లో 15 ఏళ్ల తిలోత్తమ (252.3 పాయింట్లు) త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. కొరియన్ షూటర్ కోన్ ఎంజీ (252.4) 0.1 తేడాతో బంగారం గెలుచుకుంది. ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో అర్జున్, దివ్యాన్‡్ష, హృదయ్ హజారికా (1892.4 పాయింట్లు) త్రయం బంగారు పతకం గెలిచింది. తిలోత్తమ, శ్రీయాంక, రమితలతో కూడిన మహిళల బృందం కాంస్యంతో సంతృప్తి చెందింది. సీనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్జీత్ సింగ్, దర్శన రాథోడ్ జోడీ 139 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. -
హీరోతో ప్రేమలో అర్జున్ సర్జా కూతురు.. త్వరలోనే నిశ్చితార్థం!
అర్జున్ సర్జా.. సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటించి యాక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్లపాటు హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈయనకు డైరెక్షన్లోనూ అనుభవం ఉంది. అర్జున్ సర్జాకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్ మాత్రం తన ఖాతాలో పడలేదు. కూతురి కోసం నటుడి విశ్వ ప్రయత్నాలు కూతురి కోసం అర్జున్ డైరెక్టర్గా మారి సొల్లితరవా సినిమా తీశాడు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. దీంతో మరోసారి తన కూతురిని హీరోయిన్గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్య చాలాకాలంగా ప్రముఖ నటుడి తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కోలీవుడ్లో ఓ వార్త వైరల్గా మారింది. ఉమాపతి కూడా హీరోయే! వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారని, త్వలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే ఉమాపతి కూడా కోలీవుడ్లో హీరోగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని ఓ లుక్కిచ్చారు -
ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నాకు చాలా కంఫర్ట్..!
-
ఆ సినిమా చూసి నన్ను పాలిటిక్స్ లోకి వెళ్ళమన్నాడు
-
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్మనీ, 125 పాయింట్లు లభించాయి. -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్గా, రేసీ స్క్రీన్ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్లో హెరాల్డ్ దాస్తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్డమ్ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
మూవీ ఫ్లాప్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది : అర్జున్
-
ఆ హీరోతో కలిసి నటించాలని ఉంది... మనసులో కోరిక బయటపెట్టిన అర్జున్
-
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
అర్జున్ పరాజయం సెమీస్లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్లను ఆడించారు. తొలి గేమ్లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడించారు. ఇందులో తొలి గేమ్లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్డెత్’ తొలి గేమ్లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
క్వార్టర్స్లో అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement