సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం బాలల దినోత్సవం రోజు అతడు కిడ్నాపయ్యాడు. మళ్లీ తన పుట్టినరోజున తిరిగి ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఈ చిత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. భల్స్వా ప్రాంతానికి చెందిన ఫరీదా అనే మహిళ 2007 నవంబర్ 14వ తేదీన తన ఏడాది వయసున్న కొడుకు షహాబ్ను తీసుకుని బాబూ జగ్జీవన్ రాం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆ పిల్లాడిని బెంచి మీద కూర్చోబెట్టి.. టీకాలు వేయించడానికి అపాయింట్మెంట్ చీటీ తీసుకోడానికి లైనులో నిల్చున్నారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి కావడంతో పిల్లాడిని ఎక్కువసేపు ఎత్తుకోలేక బెంచి మీద కూర్చోబెట్టారు. లైనులో ఉండగా ఓ స్నేహితురాలు పలకరిస్తే ఆమెతో మాట్లాడారు.
పది సెకండ్ల సేపు దృష్టి మళ్లిందో లేదో.. అంతలోనే బెంచి మీద పిల్లాడు అదృశ్యం అయిపోయాడు. పిల్లాడి తల్లితో పాటు ఆస్పత్రి సిబ్బంది కూడా మొత్తం గాలించినా ఎక్కడా కనిపించలేదు. దాంతో కృష్ణానగర్ పోలీసు స్టేషన్లో అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి ఆచూకీ కనుక్కోలేక 2009లో కేసు మూసేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు రోజూ నాలుగు గంటల పాటు తమ కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నామని అతడి తండ్రి అఫ్సర్ చెప్పారు. పిల్లాడి ఫొటోను ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరిగేవాడినన్నారు.
అలా పెట్టుకున్న ఫొటోయే అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఓల్డ్ సీలాంపూర్ ప్రాంతంలో ఈ దంపతులు ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడ బంధువులకు తమ కష్టం చెప్పుకొని, షబాబ్ ఫొటో చూపించారు. అలాంటి పోలికలతో ఉన్న ఓ పిల్లాడు తమ ఇంటిపక్కన ఉన్నాడని ఆయన చెప్పారు. దాంతో వెంటనే ఆ ప్రాంతంలో గాలించినా, పిల్లాడు దొరక్కపోవడంతో పోలీసులకు తెలిపారు. వాళ్లు ఆ ప్రాంతంలో స్కూళ్లను గాలించగా, అలాంటి పిల్లాడు కనిపించాడు. అతడిని రెండు రోజులు అనుసరించి, ఇల్లు కనుగొన్నారు. అతడి ప్రస్తుత తల్లిదండ్రులను గట్టిగా నిలదీశారు. తాము అతడిని దత్తత తీసుకున్నామని వాళ్లు చెప్పినా, అందుకు ఆధారాలు చూపించలేకపోయారు. చివరకు తామే అతడిని ఆస్పత్రి నుంచి ఎత్తుకొచ్చినట్లు అంగీకరించారు. దాంతో పోలీసులు పిల్లాడిని అసలు తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే అతడు వాళ్ల కొడుకేనా కాదా అని తేల్చడానికి డీఎన్ఏ పరీక్షలు చేశారు. దాని ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యం.. ఇప్పుడు ప్రత్యక్షం!
Published Thu, Aug 25 2016 9:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement