రద్దు మంచిదే.. ఇబ్బందులు తొలగించాలి | Sakshi
Sakshi News home page

రద్దు మంచిదే.. ఇబ్బందులు తొలగించాలి

Published Mon, Nov 28 2016 3:55 AM

రద్దు మంచిదే.. ఇబ్బందులు తొలగించాలి - Sakshi

టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కోదాడ: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, టీజేఏసీ దీనిని స్వాగతిస్తుందని అయితే అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించక పోవడం అన్యాయమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిల్లర సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.

యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కొత్త 500 నోట్లను అందుబాటులోకి తేవాలన్నారు. సంవత్సరాల తరబడి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు.

Advertisement
Advertisement