చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రెండురోజులుగా పర్యటిస్తూ తమిళులు చూపుతున్న అభిమానంతో తడిసిముద్దయ్యానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేర్కొన్నారు. మహామహులను దేశానికి అర్పించిన మహోన్నతమైన భూమిగా తమిళనాడును పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ గురువారం ఈరోడ్డు, రామనాధపురం, నాగర్కోవిల్లలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు చిన్నమలై జయంతి రోజున ఆయన జన్మించిన ఈరోడ్లో తాను ఉండటం అదృష్టమని అంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు శపథం చేశారని అన్నారు.
ఈ ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు ప్రజలే పోటీచేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆశిస్తున్నట్లుగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఒక మహిళ దేశాన్ని అమ్మివేశారని పరోక్షంగా కనిమొళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్ కరువై చీకట్లు కమ్ముకున్నాయంటే ఇందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్రం ఆధీనంలోని విద్యుత్ గ్రిడ్ ద్వారా రాష్ట్ర వాటాను అందివ్వడంలో కాంగ్రెస్ వివక్ష చూపిందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రజలు విద్యుత్కోత అంటే ఎరుగరని, అక్కడి పిల్లలు తమిళనాడుకు వస్తే ఫ్యాన్ తిరగకుంటే ఆశ్చర్యపోతున్నారని అన్నారు.
2012లో తమిళనాడులో 77 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకోగా కేవలం 10,800 మంది మాత్రమే ఉద్యోగాలు పొందారని ఆయన విమర్శించారు. గుజరాత్లో ఇదే విధానంలో 57 శాతం మందికి ఉద్యోగాలు దక్కాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోడ్లోని పసుపు వైద్యం అమెరికాలో ప్రసిద్ధి చెందినదని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇక్కడి వైద్యానికి ఎగుమతులు వృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమిళ ప్రజలు, ముఖ్యంగా జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే తమిళనాడు మాత్రమే కాదు దేశ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు.
కాంగ్రెస్ వల్లే కారుచీకట్లు
Published Thu, Apr 17 2014 11:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement