సాక్షి, ముంబై: రాష్ట్రానికి శీతాకాల రాజధాని అయిన నాగపూర్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి సెంట్రల్ మ్యూజియం(అజబ్ బంగ్లా)కు మహర్దశ రానుంది. మ్యూజియం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేసింది. నగర నడిబొడ్డున ఈ మ్యూజియం ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక శాఖ తరఫున ‘మ్యూజియం గ్రాండ్ స్కీం’ ద్వారా ఏటా భారత దేశంలోని మూడు మ్యూజియాలను ఎంపిక చేసి వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారు.
ఆ మేరకు 2013 సెప్టెంబర్ 13న సాంస్కృతిక శాఖ నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించింది. వీరు ఎంపిక చేసిన మూడు మ్యూజియంలలో నాగపూర్లోని సెంట్రల్ మ్యూజియం కూడా ఉంది. దీని మరమ్మతులకు రూ.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సదరు నిధులు మంజూరయినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి డెరైక్టర్కు ఇటీవల సమాచారమందింది. ఈ మ్యూజియంను 1857-1860 మధ్య కాలంలో అప్పటి జిల్లాధికారి సర్ రిచర్డ్ టెంపల్ నిర్మించారు. యాంటిక్ కలెక్షన్ సొసైటీ ద్వారా సేకరించిన దేశ, విదేశాలకు చెందిన అనేక అద్భుతమైన వస్తువులను ఇందులో ఉంచారు.
సిబ్బంది నిర్లక్ష్యంతో నిధుల లేఖ మాయం..
ఇదిలా ఉండగా అజబ్ బంగ్లా) మరమ్మతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆరు నెలల కిందట కేంద్రం పంపించిన లేఖ అదృశ్యమైంది. నిధులు మంజూరు విషయాన్ని 2013 డిసెంబర్ తొమ్మిదో తేదీన సాంస్కృతిక శాఖ కార్యదర్శి సంజయ్కుమార్కు అందిన లేఖను ఆయన మ్యూజియం బాధ్యుడు మధుకర్ కఠాణేకు పంపించారు. కాగా మ్యూజియం డెరైక్టర్కు ఈ లేఖకు సంబంధించిన సమాచారం లేకపోవడం గమనార్హం.
ఆరు నెలల నుంచి ఆ లేఖ విషయం తెలియని డెరైక్టర్కు నిధుల విడుదల విషయం తెలిసి అవాక్కయ్యారు. లేఖ గురించి మధుకర్ను ప్రశ్నించగా తనకు తెలియదని ఆయన దాటవేశాడు. ఇదిలా ఉండగా, మ్యూజియంను సందర్శించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ బృందం త్వరలో రానుండటంతో ఇప్పుడు మ్యూజియం అధికారులందరూ ఆ లేఖ వేటలో పడ్డారు.
సెంట్రల్ మ్యూజియంకు మహర్దశ
Published Tue, May 27 2014 10:51 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్లు విడుదల
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
రైతుల సమస్యలపై సమరశీల పోరాటం
7న దళితమిత్ర రాష్ట్ర మహా సభ
25న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ప్రసాద్గౌడ్
సింహ వాహనంపై చెన్నకేశవుడు
గడువు దాటిన సిలిండర్తో జాగ్రత్త..!
మూల్యాంకన కేంద్రాల తనిఖీ
తాటి ముంజెలు.. లాభాలు బోలెడు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement