ధావన్‌ త్రోపై పాండ్యా అసహనం! | Sakshi
Sakshi News home page

ధావన్‌ త్రోపై పాండ్యా అసహనం!

Published Mon, Jan 28 2019 4:09 PM

Hardik Pandya loses his cool after Dhawans bad throw - Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. శిఖర్‌ ధావన్‌ త్రోను సరిగా వేయకపోవడంతో హార్దిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. నిషేధం అనంతరం జట్టులో చేరిన పాండ్యాకు కివీస్‌తో మూడో వన్డేలో చోటు దక్కింది.  గత రెండు వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ స్థానంలో హార్దిక్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా అటు బౌలింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు.  చహల్‌ వేసిన 17వ ఓవర్‌ తొలి బంతిని కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడగా.. ఫార్వార్డ్‌ ఫీల్డింగ్‌ ఉన్న పాండ్యా సూపర్‌ డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రెప్పపాటులోనే పాండ్యా సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్సన్‌(28) నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఇక బౌలింగ్‌లోనూ రాణించి రెండు రెండు వికెట్లు సాధించాడు.

కాగా, న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 14వ ఓవర్‌ వేస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సరిగా త్రో చేయకపోవడంతో అతనిపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని రాస్‌ టేలర్‌ మిడ్‌ వికెట్‌ దిశగా కొట్టాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో సింగిల్‌ పూర్తి చేసుకున్న టేలర్‌.. రెండో పరుగు కోసం యత్నించాడు. అయితే బంతిపైకి వేగంగా పరుగెత్తుకొచ్చిన శిఖర్ ధావన్ బంతిని అందుకున్నాడు. బంతిని అందుకున్న తడువుగా బ్యాడ్‌ త్రో చేశాడు. అటు బౌలర్‌కి కాకుండా ఇటు కీపర్‌కి కాకుండా పిచ్‌ మధ్యలోకి విసిరాడు.   దీనిని అదునుగా భావించిన రాస్ టేలర్ రెండో పరుగుని కూడా పూర్తి చేశాడు. తన బౌలింగ్‌లో అదనంగా మరో పరుగు రావడంతో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా... కమాన్‌ యార్‌ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ చదవండి: వారెవ్వా పాండ్యా.. వాటే క్యాచ్‌!

టీమిండియాదే సిరీస్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement