సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనను కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తిరుపతి టీడీపీ నాయకులు ఈ దాడికి పాల్పడడాన్ని ప్రసార మాధ్యమాల్లో అందరూ చూసినా దాంతో తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకునేందుకు ఆ పార్టీ మంత్రులు, నాయకులు నానా అవస్థలు పడుతున్నారు.
టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీని గురించి ప్రస్తావించి ఇలాంటి ఘటన జరక్కూడదని, అది ఎవరు చేసినా తప్పేనన్నారు. ఘటనను ఖండించి బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఈ గొడవ ఎటు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందు అమిత్ షాకు రాష్ట్రంలో తిరిగే హక్కులేదని సాక్షాత్తూ పలువురు మంత్రులు సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
సీఎం, మంత్రుల్లో అలజడి
అమితషా కాన్వాయ్పై దాడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో టీడీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే.. దీనిపై ఏం చేయాలి, ఎలా స్పందించాలనే దానిపై మంత్రులు హడావుడి పడ్డారు. మరోవైపు.. కంగారులో మంత్రులు, నాయకులు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ మంత్రి చినరాజప్ప అధికారికంగా దీనిపై వివరణ ఇస్తూ.. అమిత్ షాపై అసలు దాడి జరగలేదని చెప్పడం విశేషం. టీడీపీ ముసుగులో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తంచేశారు.
కొద్దిసేపటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమని, అమిత్ షాపై గౌరవం ఉందన్నారు. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు జిల్లా నాయకులు మాట్లాడుతూ.. అసలు రాళ్ల దాడే జరగలేదని, ఒక జెండా కర్ర వాళ్ల కారుకి తగిలిందని చెప్పుకొచ్చారు. రాళ్ల దాడి జరిగినట్లు చినరాజప్ప చెప్పారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తాము వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతున్నామంటూ, ఉపముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పినట్లు వివరించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాళ్లు పడ్డాయని చినరాజప్ప చెప్పి తమ కొంపముంచారని ఇతర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు వాపోవడం గమనార్హం.
టీడీపీ ఉలికిపాటు!
Published Sat, May 12 2018 4:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement