* చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ
* ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానం టీడీపీకి
* వదులుకునేందుకు సిద్ధం
* నర్సరావుపేట, కోడుమూరు
* అభ్యర్థులను మార్చడానికి అంగీకారం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒత్తిడికి బీజేపీ తలొగ్గింది. పొత్తుల్లో ఇప్పటికే కేటాయించిన ఇచ్ఛాపురం స్థానాన్ని వదులుకోవడానికి, నర్సరావుపేట, కోడుమూ రు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు అంగీ కరించింది. కానీ నరసాపురం, రాజంపేట లోక్సభ అభ్యర్థులను మార్చేందుకు ఒప్పుకోలేదు. మొత్తంమీద 4 లోక్సభ, 13 అసెంబ్లీ స్థానాలతో బీజేపీ సరిపెట్టుకుంది. సీమాం ధ్రలో ఒంటరిగా పోటీ చేయాలని భావించినప్పుడు పొత్తు పెట్టుకోవాలంటూ ఒత్తిడి తెచ్చి, తీరా పొత్తు కుదిరి నామినేషన్ల ఘట్టం కూడా పూర్తవుతున్న సందర్భంలో చంద్రబాబు ఎత్తుగడ బీజేపీ నేతలను విస్మయపరిచింది. బీజేపీకి బలం లేదని, బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోందంటూ అడ్డగోలు వాదన చేయడం రాష్ట్ర బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించినప్పటికీ జాతీయ నేతల జోక్యంతో రాజీకి రాక తప్పలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్ చేరుకుని శుక్రవారం చంద్రబాబుతో చర్చలు జరిపారు.
ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నివాసంలో ఇరు పార్టీల నేతలు ప్రకాశ్ జవదేకర్, కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జవదేకర్, సుజనాచౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తు సజావుగా కొనసాగుతుందన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఇచ్ఛాపురం స్థానాన్ని బీజేపీ వదులుకుంటున్నట్టు జవదేకర్ తెలిపారు. దానికి బదులుగా పార్టీకి మరో ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందన్నారు. విశాఖపట్నం లోక్సభ నుంచి కంభంపాటి హరిబాబు, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, తిరుపతి (ఎస్సీ) స్థానంలో కారుమంచి జయరాం, రాజంపేట నుంచి పురందేశ్వరి పోటీలో ఉంటారని స్పష్టంచేశారు.
నరసరావుపేట, కోడుమూరులో మార్పు
నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థి యడ్లపాటి రఘునాథ్బాబు స్థానంలో నల్లబోతు వెంకట్రావుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కోడుమూరులోనూ పార్టీ అభ్య ర్థి కె.రమేష్ విషయంలో స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఎం.రేణుకమ్మను బరిలో ఉంచాలని నిర్ణయించారు. దీనిని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించాల్సి ఉంది. నరసాపురం, రాజంపేట లోక్సభ అభ్యర్థులను మార్చాలని చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలందరూ డిమాండ్ చేశారు. నరసాపురంలో రఘురామకృష్ణంరాజును దించాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే వీహెచ్పీ ఉపాధ్యక్షుడు గంగరాజు పేరు మార్పునకు బీజేపీ నేతలు అంగీరిస్తారేమో నని ఆరెస్సెస్ ముందు జాగ్రత్త తీసుకుంది. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ వెంకయ్య ఇంట్లో జరిగిన బీజేపీ నేతల చర్చల్లో పాల్గొని ఆరెస్సెస్ అభీ ష్టాన్ని తెలియజేశారని సమాచారం. దీంతో గంగరాజును మార్చేందుకు బీజేపీ ససేమిరా అంది. రాజంపేటలో పురందేశ్వరిని మార్చడం కుదరని తేల్చింది. అనంతరం పురందేశ్వరికి బీ ఫామ్ ఇచ్చారు. ఆమె శనివారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బీజేపీ సీటులో కోత
Published Sat, Apr 19 2014 1:53 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement