ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

Published Tue, Aug 6 2019 7:01 PM

Municipal RI Caught For Taking Bribe In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ ఓ ఆర్‌ఐ.. ఏసీబీకీ పట్టుబడ్డాడు. దరఖాస్తు దారుని నుంచి లంచం తీసుకుంటూ ఆర్‌ఐ శంకరరావు అడ్డంగా దొరికిపోయాడు.  పట్టణంలోని బహుళ అంతస్తు భవనానికి అసెస్మెంట్‌ ట్యాక్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి 2.80 లక్షల భారీ మొత్తం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించటంతో పక్కా ప్రణాళికతో నిఘా వేసిన ఏసీబీ.. మున్సిపల్‌ ఆర్‌ఐ శంకరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Advertisement
Advertisement