లాభాల బాటలో స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ సడలింపులతో మార్కెట్‌ జోరు..

Published Mon, Jun 1 2020 11:00 AM

Indian equity markets shot up over 2 per cent each - Sakshi

ముంబై : కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ను  పొడిగించినా భారీ సడలింపులను ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట‍్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, ఆసియా మార్కెట్ల ఊతం కూడా మదుపుదారుల్లో సానుకూల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.

మెటల్‌, బ్యాంక్‌ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు నెలకొంది. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ భారీగా లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 912 పాయింట్ల లాభంతో 33,336 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా 260 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9840 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి : సిప్‌ రెట్టింపు చేసుకోండి

Advertisement
Advertisement