
శ్రీకాకుళం :‘మా గ్రామంలో సమస్యలు తిష్ఠ వేశాయి సార్. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు’ అంటూ రాజాం మండలం మల్లినాయుడు అగ్రహారం కాలనీకి చెందిన దబ్బాక వెంకటరమణ జగన్కు విన్నవించారు. నాలుగేళ్ల కిందట బడి మూసేశారని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తున్నారని తెలిపారు. కొత్తవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. సాగు, తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు.