‘అనంత’లో కలకలం..
* చిరుత దాడిలో ఇద్దరు యువకులకు గాయాలు
* వలవేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
రాయదుర్గం: జనారణ్యంలోకి వచ్చిన రెండు చిరుతలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కలకలం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి అడవిలో నుంచి పట్టణంలోకి వచ్చిన రెండు చిరుతలు స్థానిక ఈ-సేవా సెంటర్ సమీపంలోని ముళ్లపొదల్లో ఉన్న పందులపై దాడి చేసి వాటిని తిని అక్కడే చిక్కుకుపోయాయి. ఉదయం వేళలో ఓ చిరుత వెళ్లిపోగా, మరో చిరుత అక్కడే ఉండిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో ఓ యువకుడు బహిర్భూమి కోసం ముళ్లపొదలవైపు వెళ్లడంతో చిరుత కనిపించింది. దీంతో వెంటనే అతను పట్టణంలోకి వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే కొందరు యువకులు చిరుతపై రాళ్లు వేయడంతో అది రవినాయక్ అనే యువకుడిపై దాడి చేసింది. అతను స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కిన చిరుత అడ్డుకోబోయిన జాఫర్ అనే యువకుడిని గాయపర్చింది. మరోసారి ప్రయత్నించిన అటవీశాఖ సిబ్బంది స్థానికుల సాయంతో చిరుతను వలలో బంధించారు. చిరుతను తిరుపతి జూకు తరలించనున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు తెలిపారు.
చిరుత.. చిక్కింది
Published Fri, Aug 26 2016 12:34 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement