నల్లగొండ రూరల్: నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఆల్మస్ ఫర్హీన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ ఆపరేటర్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్పై రెండు నెలలు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టెన్త్, డిగ్రీ(పాస్/ఫెయిలై) చదివి, 35ఏళ్ల లోపు గల వారు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిచంఆరు. పూర్తి వివరాల కోసం 7032649925, 9177785283 నంబర్లను సంప్రదించాలన్నారు.
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
మునుగోడు : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మునుగోడు మండలంలోని కోతులారం గ్రామానికి చెందిన పగిళ్ల వంశీ(21) లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం లారీ డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన వంశీ మంగళవారం మంగళవారం ఉదయం 10గంటల వరకు ఇంటి వద్దే ఉండి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఏమైందో ఏమో కానీ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి సమీపంలో ఇటుక బట్టీల వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి మధ్యాహ్న సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ‘నేను పురుగుల మందు తాగాను’ అని చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వంశీని హైదరాబాద్కు తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. వంశీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.