Sakshi News home page

No Headline

Published Sat, Nov 18 2023 1:30 AM

-

యాదగిరిగుట్ట : కార్తీకమాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం దీపారాధన నిర్వహించారు. భక్తులు ప్రమిదలు కొనుగోలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు.నాగుల చవితి సందర్భంగా మొదటి ఘాట్‌ రోడ్డులో ఉన్న నాగదేవత పుట్ట వద్ద పూజలు చేశారు. అదే విధంగా ప్రధానాలయంలో ఊంజలి సేవోత్సవం కనులపండువగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సేవను ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. దీంతో పాటు ఆలయ ముఖ మండపం, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమంనిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement