వెలమ సంఘం ఆధ్వర్యంలో సత్కారాలు | Sakshi
Sakshi News home page

వెలమ సంఘం ఆధ్వర్యంలో సత్కారాలు

Published Sat, Dec 2 2023 12:56 AM

- - Sakshi

వీరవాసరం: వీరవాసరం వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వీరవాసరంలో ఎంపీ కోటగిరి శ్రీధర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ప్రసాదరావు దంపతులు, ఆకివీడు మున్సిపల్‌ చైర్మన్‌ జామి హైమావతిలకు అభినందన సత్కారం నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలమ కులస్తులకు రెండే తెలుసునని ఒకటి సాయం, రెండు వ్యవసాయం అని, కోటగిరి శ్రీధర్‌ గత ఎన్నికల్లో తన గెలుపు కోసం వీరవాసరం మండలంలో ప్రత్యేక శ్రద్ధతో సహకరించారని తెలిపారు. జెడ్పీ ఘంటా పద్మశ్రీ, ప్రసాదరావు దంపతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెలమ కులస్తులు రాజకీయ పదవుల్లో బాగా వెనకబడి ఉండేవారని, ప్రస్తుతం అధిక శాతంలో ఎమ్మెల్యేలుగా, ,ఎంపీలుగా పదవుల్లో ఉంటూ ప్రజాసేవలు అందిస్తున్నారన్నారు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యక్తిగా మంచి స్నేహితుడని అలాంటి వ్యక్తులకు మన సంఘం పూర్తి సహకారం అందించాలన్నారు. వేదికపై ఏఎంసీ చైర్మన్‌ కోటిపల్లి బాబు, జెడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, ఉంగుటూరు ఏఎంసి డైరెక్టర్‌ మరడా రమావతి, వీరవాసరం సర్పంచ్‌ చికిలే మంగతాయారు, సొసైటీ చైర్మన్‌ కొలుపూరి గౌరీ, ఎంపీటీసీ బోను జోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement