నేడు శోభాయాత్ర | Sakshi
Sakshi News home page

నేడు శోభాయాత్ర

Published Tue, Nov 14 2023 9:56 AM

-

చంద్రగిరి(తిరుచానూరు): శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పున్నమి గరుడ సేవ రోజున శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీ కాసుల హారాన్ని గజవాహనం రోజున అమ్మవారికి అలంకరించడం పరిపాటి. ఇందులో భాగంగా మంగళవారం పల్లకీ ఉత్సవం అనంతరం సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని తిరుమల నుంచి శోభాయాత్రగా తీసుకొచ్చి ఆలయ అధికారులకు అందజేయనున్నారు. రాత్రి గజవాహన సేవలో సహస్ర లక్ష్మీకాసుల హారంతో శ్రీవారి పట్టపురాణి అయిన శ్రీపద్మావతి అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదిలావుండగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహనం రోజున వసంతోత్సవం(చందనోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సన్నిధి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరువీధుల్లో భక్తులపై చందనపు నీళ్లను చల్లుతూ అమ్మవారిని ఊరేగించనున్నారు

Advertisement
Advertisement