– బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చెప్పారు. నెల్లికల్లు లిఫ్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాగర్లో బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటైందని, కుంకుడుచెట్టు తండాలో డీ8, డీ9 కెనాల్ పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.350 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. తిరుమలగిరి మండలానికి డబుల్ రోడ్డు ఏర్పాటు చేయాలని, పులిచర్ల, కన్నెకల్ను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని, చెక్ డ్యాంలను నిర్మించాలని, కంపాసాగర్లో 285 ఎకరాల స్థలం ఉందని అందులో వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు మరోసారి తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment