● చంద్రబాబుపై మంత్రి ధర్మాన ధ్వజం
జలుమూరు: చంద్రబాబు తన అనుకూల మీడియా తో పబ్బం గడుపుతున్నారని, ఆయనకు శ్రీకాకుళం జిల్లా అంటే ఎప్పుడూ చిన్నచూపేనని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన సోమవా రం చల్లవానిపేట పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జలుమూరు–సారవకోట మండలాల కార్యకర్తల ఆత్మీయ కలయికలో మాట్లాడారు. విభజన సమయంలో జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థనైనా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా గత ఐదేళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్ జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు ప్రారంభించారని తెలిపారు. హిరమండలంలో వైఎస్సార్ సుజలధార, పలాసలో కిడ్నీ ఆస్పత్రి, మూలపేటలో పోర్టు, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వైఎస్ జగన్ చొరవతోనే జరిగాయన్నారు. రిమ్స్ను అభివృద్ధి చేసి పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. కరోనా సమయంలో తాను కూడా రిమ్స్లోనే చికిత్స చేయించుకున్నానని చెప్పా రు. అదే సమయంలో చంద్రబాబు కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ తప్ప ఇంకేమీ జరగలేదన్నారు. వైఎస్సార్ సీపీ పేదల అవసరాలు తీరుస్తుంటే.. టీడీపీ పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. ధర్మాన సోదరులు వైఎస్ కుటుంబానికి విధేయులని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, పోలాకి జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామ్దాస్, ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, జి.రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణి, అల్లాడ, చల్లవానిపేట, సారవకోట సొసైటీ అధ్యక్షులు ఎం.శ్యామలరావు, పి.రాజప్పల నాయుడు, జి.వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షుడు కనుసు సీతారాం, వరుదు వంశీకృష్ణ, నక్క తులసీదాస్, మండల సలహాదారు పి.విఠలరావు, వి.విజయ్, కోన దామోదరరావు, దామ మన్మధరావు, వాన నాగేశ్వరరావు తోపాటు పెద్ద ఎత్తున సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.