చెరువులో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Published Tue, Apr 9 2024 1:45 PM

చెరువులో నుంచి బుడ్డెపు నీలాద్రి
మృతదేహాన్ని వెలికితీసిన అగ్నిమాపక సిబ్బంది  - Sakshi

కంచిలి: మఠం కంచిలిలో గల మఠం చెరువులో జెన్నాగాయి గ్రామానికి చెందిన బుడ్డెపు నీలాద్రి(42) అనే వ్యక్తి చెరువులో మునిగి చనిపోయారు. నీలాద్రి సోమవారం తన భార్యతో కలిసి కంచిలిలో కూలి పనికి వచ్చారు. మధ్యాహ్నం స్నానం చేస్తానని చెరువులో దిగాడు. కొద్దిసేపటికి ఊపిరాడక నీళ్లు తాగి మృతి చెందాడు. మృతునికి భార్య జానకి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సోంపేట అగ్నిమాపక శకటం సిబ్బంది వాహనంతో వచ్చి చెరువులో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే నీలాద్రి మృతి చెందాడని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన ఈ వ్యక్తి మృతిచెందడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇన్‌చార్జి ఎస్‌ఎఫ్‌ఓ డి.భాస్కరరావు, సిబ్బంది ఆర్‌.సింహాచలం, వై.ఈశ్వరరావు, కేవీ రమణ, బి.బాబూరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య జానకి ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ వి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక సర్పంచ్‌ గణప సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement