Sakshi News home page

కుటుంబ కలహాలతో సొంతింటికే నిప్పు

Published Wed, Apr 17 2024 8:20 AM

మంటల్లో కాలిపోతున్న ఇల్లు  - Sakshi

సిద్దిపేటరూరల్‌: కుటుంబ కలహాలతో సొంతింటికే నిప్పు పెట్టుకున్నారు. ఈ ఘటన నారాయణరావుపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ అపూర్వరెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పొన్నమేని నర్సింహులు తన భార్య రేణుకతో తరుచుగా గొడవ పడుతుంటాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కూడా భార్యాపిల్లలతో గొడవ పడ్డాడు. కోపాద్రిక్తుడైన అతను పెట్రోల్‌ తీసుకొచ్చి ఇంటిపైనే పోసి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్‌, ఫ్రిడ్జ్‌, విలువైన వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.5లక్షల వరకు నష్ట జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

నారాయణరావుపేటలో ఘటన

Advertisement
Advertisement