● విద్యాశాఖ పాఠ్యపుస్తకాల డైరెక్టర్ రవీంద్రనాథ్రెడ్డి
కనిగిరి రూరల్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా నూరుశాతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు విద్యాశాఖ పాఠ్యపుస్తకాల
డైరెక్టర్ కె.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలను, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను, జేవీకే కిట్ల స్టాక్ పాయింట్లను గురువారం ఆయన అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కచ్చితంగా జగనన్న విద్యా కానుక కిట్లను అందచేయాలన్నారు. ఏ విద్యార్థికై నా కిట్లు అందకపోతే సంబంధిత మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి జేవీకే ఇట్లు ఇచ్చారా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా వారికి కావాల్సిన సేల్ టెస్ట్బుక్స్లు అందుబాటులో ఉంచామన్నారు. శనివారం లోగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలన్నీ కచ్చితంగా అంచేయాలన్నారు. ఎంఈఓ జె.ప్రసాద్రావు, ప్రధానోపాధ్యాయులు రాజాల కొండారెడ్డి, కె.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment