ఘనంగా కోటి హనుమాన్‌ చాలీసా పారాయణం | Sakshi
Sakshi News home page

ఘనంగా కోటి హనుమాన్‌ చాలీసా పారాయణం

Published Fri, Nov 10 2023 5:00 AM

- - Sakshi

నిజామాబాద్‌ సిటీ: జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌ హనుమాన్‌ జంక్షన్‌లో గురువారం రాత్రి కోటి హనుమాన్‌ చాలీసా ప్రచార రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా హనుమాన్‌ జంక్షన్‌లో హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్‌ స్వా మి ఆధ్వర్యంలో హనుమాన్‌ చాలీసా పారాయణం, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ నవరి 21న తిరుపతిలో కోటి హనుమాన్‌ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భా గంగా రెండు రోజులు పాటు జిల్లాలో మహా యజ్ఞం రథయాత్ర నిర్వహించారు. ఆర్గనైజర్‌ మురళి, గురుస్వామి నాగభూషణం, గంగాధర్‌, కులచారి సంతో ష్‌, సోమ శ్రీశైలం, మల్లేష్‌ స్వామి పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement