బీజేపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ మృతి.. ప్రధాని సంతాపం

Uttarakhand: Eight Time MLA BJP Senior Leader Harbans Kapoor Passed Away - Sakshi

డెహ్రాడూన్‌: బీజేపీ సీనియర్‌ నాయకుడు హర్బన్స్‌ కపూర్‌ (75) ఆదివారం కన్నుమూశారు. డెహ్రాడూన్‌ నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2007 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. కపూర్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్‌ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మితభాషిగా పేరున్న కపూర్‌ ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించేవాడని సీఎం పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత ఎదిగినా ఆయన నిరాడంబరంగా బతికారని గుర్తు చేసుకున్నారు. కపూర్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోది సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ట్విటర్‌ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సేవతో కపూర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

(చదవండి: ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top