ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

Published Sun, Apr 14 2024 2:40 AM

- - Sakshi

నల్లగొండ రూరల్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ సూచించారు. శనివారం నల్లగొండ సమీపంలోని ఆర్జాలాబావి, ఎస్‌ఎల్‌బీసీ, మండలంలోని కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా రైతుల ముందే తూకం వేయాలన్నారు. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వసతి కల్పించాలని, సీరియల్‌ ప్రకారం ధాన్యం తూకం వేయాలని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్‌రావు, జిల్లా సహకార అధికారి కిరణ్‌ కుమార్‌, డీపీఎం రామలింగయ్య, ఏపీఎం వినోద, సీసీ గీత పాల్గొన్నారు.

Advertisement
Advertisement