మద్యానికి బానిసై ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై ఆత్మహత్య

Published Tue, Nov 14 2023 4:28 AM

-

నాగిరెడ్డిపేట: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం.. హవేళిఘణాపూర్‌ మండలం వాడి గ్రామానికి చెందిన మంద శంకర్‌(41), భార్య యశోదతో కలిసి అత్తగారి గ్రామమైన పోచారంలో జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన శంకర్‌ 11న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ప్రాజెక్టులో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement