మహబూబ్నగర్ క్రైం: ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది విధుల పర్యవేక్షణ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఈసీఐ నిబంధనలు తప్పక అమలు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం అన్ని రకాల పోలీస్ బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు అన్ని విధుల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని, ఈ నెల 12, 13న ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూంల దగ్గర, కౌటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పోలింగ్ బూత్ వారీగా చిన్నపాటి సమస్య రాకుండా నియత్రించాలని, ఓటర్లను భయాందోళనకు గురిచేసే అవకాశం లేకుండా చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పోలింగ్ రోజు ఎల్డబ్ల్యూఈ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూట్ బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక బలగాలు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎస్టీ బృందాల విధులు ప్రధానంగా ఉండాలని, అతి కీలకమైన పాయింట్స్ దగ్గర సెంట్రల్ ఫోర్స్ విధుల్లో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలోని చెక్ పోస్టుల దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ఎస్పీ ఎస్ఎస్టీ టీం డ్యూటీలు, ఎల్డబ్ల్యూఈ విధులు ఎలా నిర్వహించాలో క్లుప్తంగా వివరించడంతోపాటు ఏరియా డామినేషన్, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్, ఇతర ఎన్నికల విధులపై సిబ్బందికి ప్రత్యేకంగా వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు.
కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా
Published Sat, May 4 2024 12:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కాంగ్రెస్ గూటికి సెల్లూరు రాజా?
విద్యుత్ షాక్తో వృద్ధుడి మృతి
పల్లావరంలో ఉత్కంఠ
రూ.1.36 కోట్లు మోసం
వైభవంగా తిరుకామీశ్వరర్ రథోత్సవం
శిశువుల అపహరణ కట్టడికి కొత్త ప్రయోగం
కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 14 టేబుల్స్ ఏర్పాటు
ప్రయాణికులను మధ్యలో దింపేశారు!
సిబ్బంది నిర్లక్ష్యం.. గర్భిణులకు ఇక్కట్లు
తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement