Sakshi News home page

తుస్సుమన్న బాలయ్య బస్సు యాత్ర

Published Tue, Apr 16 2024 1:45 AM

-

కర్నూలు/నందికొట్కూరు: సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సుయాత్రకు సోమవారం కర్నూలు, నందికొట్కూరులో స్పందన కరువైంది. కర్నూలులోని చిన్నమ్మ వారిశాల నుంచి మౌర్యాఇన్‌ హోటల్‌ వరకు రోడ్‌షో నిర్వహించగా జనాలు పెద్దగా కనిపించలేదు. కొండారెడ్డిబురుజు దగ్గర ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ప్రారంభించగానే మైకులు పనిచేయలేదు. మైకులను సరిచేసినా.. బాలకృష్ణ మాటలు అర్థం కాక ప్రారంభంలోనే జనం వెనుదిరిగారు. ముస్లింలను ఆకట్టుకునేందుకు ఉర్దూలో మాట్లాడేందుకు ప్రయత్నించి నోరు తిరగక బాలకృష్ణ తడబడ్డారు. జనాలకు అర్థం కాకపోవడంతో మళ్లీ తెలుగులో మాట్లాడారు. బాలకృష్ణ ప్రసంగం రొటీన్‌గా సాగడంతో ప్రజల నుంచి స్పందన లభించలేదు. నందికొట్కూరులో బాలయ్య తడబడుతూ ప్రసంగించడంతో అభిమానులు, ప్రజలు విసుగుచెంది ఇంటిబాట పట్టారు. బాలకృష్ణకు ఆహ్వానం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫొటో లేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన నిర్వహించారు. మాండ్ర శివానందరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు, నందికొట్కూరులో ఫ్లాప్‌ షో

Advertisement
Advertisement